News February 17, 2025
BREAKING: గోదావరిఖని: నదిలో దూకింది..!

పెద్దపల్లి జిల్లా ముస్త్యాల గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ కొద్దిసేపటి క్రితం గోదావరిఖని శివారులోని గోదావరి బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకిందని స్థానికులు తెలిపారు. నదిలో నీరు లేని ప్రదేశంలో పడటంతో ఆమెకు బలమైన గాయాలయ్యాయని చెప్పారు. స్థానికులు గమనించి ఆమెను స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్యకు యత్నించిందో కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 11, 2025
కొమ్ములవంచలో కత్తిపోట్ల కలకలం

కొడుకును పొడుస్తున్నాడని అడ్డుకున్న తల్లిని కత్తితో పొడిచిన ఘటన MHBD జిల్లాలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నర్సింహులపేట(M) కొమ్ములవంచ గ్రామంలో బూరుగండ్ల రవికి పారునంది అర్జున్లకు మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ క్రమంలో రవిని కత్తితో అర్జున్ను పొడుస్తుండగా అడ్డుకోబోయిన అతడి తల్లి సునీతను చేయి దగ్గర పొడిచాడు. వారిని 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 11, 2025
డ్రైవర్ అప్రమత్తతే 29 మందిని రక్షించింది!

TG: నల్గొండలోని చిట్యాల వద్ద <<18254484>>బస్సు<<>> దగ్ధమైన ఘటనలో డ్రైవర్ అప్రమత్తతే 29 మంది ప్రయాణికులను రక్షించింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగగా సకాలంలో స్పందించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వెంటనే వారు బస్సు నుంచి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యమూ ఓ కారణమన్న సంగతి తెలిసిందే.
News November 11, 2025
ఢిల్లీ పేలుళ్లు.. అర్ధరాత్రి వరంగల్లో ముమ్మర తనిఖీలు

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం అర్ధరాత్రి ట్రై సిటీ పరిధిలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు, వాహనాలు, లగేజ్ బ్యాగులను క్షుణ్ణంగా సోదా చేశారు.


