News October 12, 2025
BREAKING: చీరాల బీచ్లో ఐదుగురు గల్లంతు

ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల మండలంలో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. వాడరేవు సముద్ర తీరంలో అలల తాకిడికి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. మరో ఇద్దరికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 12, 2025
హనీట్రాప్ చేసిన మార్కాపురం యువకుడు

సంగారెడ్డి జిల్లా హత్నూర్ PS పరిధిలోని కోనంపేటకి చెందిన విద్యార్థి మనోజ్ను ప్రకాశం జిల్లా యువకుడు హనీట్రాప్ చేశాడు. అనంతరం అతనివద్ద నుంచి రూ.11,20,000 వసూలు చేసిన ఘటనలో మార్కాపురం యువకుడు సంజయ్ సహా పలువురిని సంగారెడ్డి సీసీయస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతితో కలిసి న్యూడ్ వీడియో కాల్స్ చేయించి బ్లాక్మెయిల్ చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News October 12, 2025
ప్రకాశం: కల్తీ మందును ఇలా తెలుసుకోండి..!

ములకలచెరువు, విజయవాడ సమీపంలో కల్తీ మద్యం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తాము తాగేది ఒరిజనల్ హా? లేదా? కల్తీనా? అని చాలా మంది సందేహ పడుతున్నారు. ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం APTATS పేరిట యాప్ తీసుకొచ్చింది. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సిటిజన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కొన్న మద్యం బాటిళ్లపై ఉన్న కోడ్ అందులో ఎంటర్ చేస్తే ఒరిజనల్ లేదా? కల్తీనా అనేది తెలిసిపోతుంది.
Share It.
News October 12, 2025
సింగరాయకొండ: రెండు రోజుల్లో విధుల్లోకి.. అంతలోనే..!

డీఎస్సీలో ఉత్తీర్ణుడై సోమవారం ఉద్యోగంలో చేరనున్న సింగరాయకొండ(M)పాకలకు చెందిన యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గాలి చంద్రారెడ్డి సోమవారం యర్రగొండపాలెం ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా చేరనున్నాడు. శనివారం రాత్రి భార్యతో గొడవ జరగడంతో ఆమె అలిగి తన అక్క ఇంటికి వెళ్లగా వెంకారెడ్డి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.