News October 7, 2025
BREAKING.. జనగామ: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

గడ్డి మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యయత్నానికి పాల్పడిన జనగామ(D) స్టేషన్ ఘన్పూర్ మండలంలో సోమవారం జరిగింది. ఈ ఘటనలో ప్రియుడు అన్వేశ్(26) మృతి చెందగా.. ప్రియురాలు పావని ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకోవడానికి పరిస్థితులు అనుకుంలించక పోవడంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Similar News
News October 7, 2025
KNR: పొన్నం వ్యాఖ్యలపై రాజుకుంటున్న రగడ

మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేకపై మరోమంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహంగా ఉన్నారట. జూబ్లీహిల్స్లో ఓ కార్యక్రమంలో తనను <<17935655>>బాడి షేమింగ్<<>> చేస్తూ చేసిన వ్యాఖ్యలపై సీఎంకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారట. వివేక్ ఓ అహంకారి అని తనకు మంత్రిపదవి రావడం ఆయనకు ఇష్టంలేదని, అలాగే పొన్నంకు శ్రీధర్ బాబు అంటే గిట్టదని, ఇలాంటి పరిస్థితులతోనే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్కు నష్టం జరుగుతుందని సన్నిహితుల వద్ద లక్ష్మణ్ వాపోయారట.
News October 7, 2025
నార్త్ వెస్టర్న్ రైల్వేలో 2,094 పోస్టులు

నార్త్ వెస్టర్న్ రైల్వే 2,094 అప్రెంటిస్ పోస్టుల ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు నవంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. జైపుర్లోని RRC ఈ నియామకాలు చేపట్టనుంది. అభ్యర్థుల వయసు 15నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.100, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు.
News October 7, 2025
ఈ చిన్నారుల మరణానికి కారణమెవరు?

కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ తాగి పిల్లలు చనిపోయిన కేసులో అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. తయారీ కంపెనీకి విచ్చలవిడిగా అనుమతులిచ్చిన మధ్యప్రదేశ్ అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. తమిళనాడుకు చెందిన సిరప్ కంపెనీ ‘శ్రీసన్’ నిబంధనలు పాటించలేదని తేలింది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టీపట్టనట్లుగా ఉండటానికి కారణమేంటనే ప్రశ్నలు తలెత్తాయి. తరచూ తనిఖీలు చేస్తే ఇలా జరిగేది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.