News January 11, 2025

BREAKING: తిరుపతిలో వ్యక్తిపై చిరుత పులి దాడి

image

ముని కుమార్ అనే వ్యక్తిపై చిరుత పులి దాడి చేసిన ఘటన తిరుపతిలోని సైన్స్ సెంటర్ ఎదురుగా చోటు చేసుకుంది. దీంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా మునికుమార్‌పై చిరుత దాడిచేయడంతో కిందపడ్డాడు. గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పట్టపగలే చిరుత దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Similar News

News February 24, 2026

నెల్లూరు: నిద్ర మాత్రలు మింగి మహిళ సూసైడ్

image

నెల్లూరు నగరంలోని సెట్టిగుంట రోడ్డు సీపీఆర్ వీధిలో నివాసం ఉంటున్న సుజాత (51) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఇంట్లో సమస్యలు, అనారోగ్యం ఆమెను తీవ్రంగా కలిచి వేసింది. ఈనెల 22వ తేదీన తన ఇంట్లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 24, 2026

నెల్లూరు: తొలిరోజు 566 మంది డుమ్మా

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్ రెండో సంవత్సరం తొలి పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆర్ఐవో వరప్రసాదరావు తెలిపారు. జిల్లాలో 81 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 26,034 మంది విద్యార్థులకు గాను 25,468 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. 566 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రకటించారు.

News February 24, 2026

నెల్లూరులో లారీ ఢీకొని బెస్ట్ ఫ్రెండ్స్ మృతి

image

నెల్లూరు శెట్టిగుంట రోడ్డుకు చెందిన హేమేంద్ర(22), వెంకటేశ్వరపురానికి చెందిన నూరుల్లా(20) మంచి స్నేహితులు. హేమేంద్ర కారు షోరూములో టెక్నీషియన్‌గా, నూరుల్లా ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరు బైకుపై హైవే మీదుగా వెంకటేశ్వరపురానికి బయల్దేరారు. చెన్నై వైపు నుంచి కావలి వైపు వెళ్తున్న లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో స్నేహితులు ఇద్దరూ చనిపోయారు.