News October 30, 2025

BREAKING: తుఫాన్ ఎఫెక్ట్.. HYD శివారులో మహిళ మృతి

image

మొంథా తుఫాను కారణంగా HYD శివారులో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. మజీద్‌పూర్-బాటసింగారం మధ్య వాగు ఉద్ధృత రూపం దాల్చింది. అటుగా వచ్చిన దంపతులు వరదలో కొట్టుకుపోయారు. గమనించిన యువకులు భర్తను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. మహిళ నీటిలో గల్లంతై చనిపోయింది. మృతురాలు నెర్రపల్లికి చెందిన కృష్ణవేణిగా గుర్తించారు. పుట్టింటి నుంచి భువనగిరికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 31, 2025

జగిత్యాల: పర్యావరణ అనుమతి తప్పనిసరి: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో మైనింగ్, క్వారీ లీజు రెన్యువల్ లేదా కొత్త లీజు మంజూరుకు రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అధ్యయన సంస్థ (SEIAA) జారీ చేసే పర్యావరణ అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రూపొందించిన డ్రాఫ్ట్ జిల్లా సర్వే నివేదికను ప్రజాభిప్రాయం కోసం జిల్లా వెబ్‌సైట్‌లో (jagtial.telangana.gov.in) పొందుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు.

News October 31, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర ₹2011, కనిష్ఠ ధర ₹1700, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర ₹1820, కనిష్ఠ ధర ₹1775, వరి ధాన్యం (JSR) ధర ₹1950గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు. అటు మార్క్‌ఫెడ్ ద్వారా నేడు మక్కల కొనుగోళ్లు జరగలేదని పేర్కొన్నారు.

News October 31, 2025

వాంకిడి: ‘నా కూతురు చావుకి కారుకులైన వారిని శిక్షించాలి’

image

తన కూతురు ప్రేమలత చావుకి కారకులైన వారిని శిక్షించాలని తండ్రి మేంఘజి కోరారు. ఈ మేరకు వాంకిడి ఎస్ఐ మహేందర్‌కి ఫిర్యాదు చేశాడు. ఖిరిడికి చెందిన ప్రేమలత(22)అదే గ్రామానికి చెందిన మహేశ్‌ను వివాహం చేసుకుంది.ఈనెల 23న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబీకులు ఆమెను వర్ధా ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ 29న మృతిచెందింది. అత్తింటి వారి వరకట్న వేధింపులతో ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు.