News January 13, 2026
BREAKING: నల్గొండ జిల్లాలో విషాదం

నల్గొండ(D) మర్రిగూడ(M) చర్లగూడెం ప్రాజెక్టు ముంపు గ్రామమైన వెంకేపల్లిలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. SI కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దంపతులు గోగుల అంజయ్య, శారదకు ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి అక్షయ్ కుమార్(10). కాగా ప్రాజెక్టు మట్టి కోసం తవ్విన గుంతలో అక్షయ్ ఈతకు వెళ్లి మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది.
Similar News
News January 31, 2026
తిరుమల లడ్డూ వివాదం.. దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు

AP: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో కొందరు తమ పార్టీ, నాయకులపై దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని DGPకి YCP ఫిర్యాదు చేసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాసింది. CBI సిట్ ఛార్జ్షీట్లోని అంశాలను తప్పుదోవ పట్టిస్తూ తమ పార్టీని నిందిస్తున్నారని పేర్కొంది. గుంటూరు, వినుకొండ, పిడుగురాళ్ల, దర్శితో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని వివరించింది.
News January 31, 2026
శని త్రయోదశి: పూజా సమయమిదే..

పంచాంగం ప్రకారం.. త్రయోదశి తిథి JAN 30న 11:09 AMకే ప్రారంభమైంది. ఆ తిథి నేడు 8:26 AM వరకు ఉంటుంది. అయితే సూర్యోదయ తిథి ప్రాముఖ్యత దృష్ట్యా శనివారం రోజే ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. 8:26 AMకే తిథి ముగుస్తుంది కాబట్టి ఆలోపు అభిషేకాలు, పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చని అంటున్నారు. శివారాధన వంటి పూజా కార్యక్రమాలు మాత్రం ప్రదోష వేళలో కూడా నిర్వహించవచ్చు.
News January 31, 2026
గుంటూరులో యువకుడిపై దాడి.. SPకి ఫిర్యాదు

గుంటూరు మండలం వెంగలయపాలెంలోని రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన యువకుడు ఆంజనేయులుపై జరిగిన దాడి ఘటనపై బాధితుడు గుంటూరు SPకి ఫిర్యాదు చేశాడు. అదే కాలనీకి చెందిన యర్రంశెట్టి రవితేజ, గణేష్, ఈపూరి రామకృష్ణ, మణికంఠ, నరేంద్రలు కత్తులు, ఇనుప రాడ్లతో ఇంటిపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేశాడు. నిందితులపై చర్యలు తీసుకుని, రక్షణ కల్పించాలని కోరాడు.


