News February 4, 2025

BREAKING: నాగర్‌కర్నూల్‌లో దారుణం.. తల్లిని చంపేశాడు!

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన యాదమ్మ కుమారుడు కరుణాకర్ మద్యంతో పాటు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో కన్నతల్లిని గోడకేసి కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 4, 2025

సంగారెడ్డి: 8న సీనీ హీరోయిన్ రాక

image

ఈనెల 8న ఓ స్కూల్ 14వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రేఖ తెలిపారు. అమీన్ పూర్ మండలం బీరంగూడలోని ఓ స్కూల్‌లో జరిగే వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ‘సంక్రాంతి వస్తున్నాం’ ఫిలిం ఫేం, ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ రానున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు పాటలు, వివిధ రకాల నృత్య, నాటక, కరాటే ప్రదర్శనలు చేస్తారని అన్నారు.

News February 4, 2025

వరంగల్ : మేడ్చల్లో రోడ్డుప్రమాదం.. యువ డాక్టర్ మృతి

image

మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామానికి చెందిన యువ డాక్టర్ చుక్క శ్రీచరణ్ ఈరోజు మృతిచెందారు. గ్రామానికి చెందిన చుక్క శ్రీనివాస్ కుమారుడైన శ్రీచరణ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వార్త తెలియగానే మహబూబాబాద్ మాజీ ఎంపి, BRS జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత హుటాహుటిన హైదరాబాద్ చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నవయసులోనే మృతిచెందడంతో విషాదం నెలకొంది.

News February 4, 2025

జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

image

యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. తన అభిమానులను వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించారు. ఇందుకోసం త్వరలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని అనుమతులు తీసుకొని ఈవెంట్ నిర్వహించడానికి కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు ఓర్పుతో ఉండాలని కోరింది. అభిమానులు తనను కలవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!