News March 20, 2025

BREAKING: నారాయణపేటలో MURDER 

image

కట్టుకున్న భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన గురువారం NRPTలో వెలుగులోకి వచ్చింది. ఇన్‌ఛార్జ్ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలు.. నారాయణపేట మండలం గోపితండాకు చెందిన శారు నాయక్(20), వినోద్ నాయక్ భార్యాభర్తలు. భార్య తనకు ఇష్టం లేదని భర్త తరుచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో భార్య శారు నాయక్‌ను బుధవారం రాత్రి భర్త గొంతు నులిమి హత్య చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు.

Similar News

News March 21, 2025

సంగారెడ్డి: ఏప్రిల్ 7 నుంచి టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం

image

రామచంద్రపురం మండల కేంద్రంలోని సెయింట్ ఆర్నాల్డ్ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 7 నుంచి 15 వ తేదీ వరకు పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. మూల్యాంకనం విధులు కేటాయించిన ఉపాధ్యాయులు తప్పకుండా హాజరు కావాలని సూచించారు.

News March 21, 2025

రామచంద్రపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

ఆర్సీపురంలో ఘోర రోడ్డు ప్రమాద సంఘటన రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎలక్ట్రికల్ వెహికల్ ను ఆర్ఎంసి వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఎలక్ట్రికల్ వెహికల్ నడిపిస్తున్న సాదు రవితేజ (36) తలపై నుంచి వాహనం పోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News March 21, 2025

BREAKING.. WNP: రోడ్డు ప్రమాదంలో రేషన్ డీలర్ మృతి

image

పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. అంబేడ్కర్ నగర్ కాలనీ సమీపంలో జూరాల కాలువ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని చెలిమిల్ల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ హనుమంతు అక్కడికక్కడే మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికు తరలించారు. 

error: Content is protected !!