News November 22, 2025

BREAKING: నిజామాబాద్ DCC అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి

image

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాట్పల్లి నగేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయన నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. ఇక నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణను నియమించారు.

Similar News

News February 15, 2026

NZB: ఆ ఐదుగురిలో మేయర్ ఎవరో?

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి 17 మంది కార్పొరేటర్లు గెలువగా అందులో ఐదుగురు మహిళలున్నారు. వారిలో 21వ డివిజన్ నుంచి గెలుపొందిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్ ఉమారాణి, 12వ డివిజన్ దుమాలే అరుంధతి, 9వ డివిజన్ కేతావత్ సురేఖ, 41వ డివిజన్ పూజిత ప్రవీన్ గౌడ్‌లో ఒకరికి మేయర్ పదవి దక్కే అవకాశాలున్నాయి.

News February 15, 2026

NZB: అక్కడ పోలీసులకు ఏం పని? : MP అర్వింద్

image

BRS కార్పొరేటర్ ఇంటి దగ్గర మీ ACP, నలుగురు SI లు ఏం చేస్తున్నారు?, అక్కడ వారికి ఏం పని’ అని MP అర్వింద్ ధర్మపురి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BRS కార్పొరేటర్‌ను ఎత్తుకెళ్లేందుకు సాయం చేస్తున్నారా గడ్డి మేపుతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పోలీస్ డిపార్ట్‌మెంట్ కాంగ్రెస్‌కు సేవ చేసేందుకు ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News February 15, 2026

NZB: 500 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం

image

నిజామాబాద్ నగరంలో ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందన ఈ దేవాలయంలోని శివలింగం స్వయంభూగా భావిస్తారు. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగం నిత్యం విశేష పూజలందుకుంటుంది. రథసప్తమి రోజున సూర్య కిరణాలు నేరుగా శివలింగంపై పడటం ఇక్కడి ప్రత్యేకత. శివరాత్రి పర్వదినాన్ని ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు.