News March 14, 2025

BREAKING: పరిగి-కొడంగల్ రోడ్డులో యాక్సిడెంట్ 

image

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పరిగి పట్టణ సమీపంలోని కొడంగల్ వెళ్లే రోడ్డులో రైస్ మిల్ సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 9, 2025

వికారాబాద్ బీజేపీ అధ్యక్ష పదవి జాప్యంపై ఉత్కంఠ

image

డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంపై పార్టీలో చర్చ నడుస్తోంది. ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినా, అధిష్ఠానం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ జాప్యానికి కారణం ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మద్దతు ఎవరికి ఉంటుందనే అంశంపై జిల్లా రాజకీయాల్లో భారీగా ఉత్కంఠ నెలకొంది.

News November 9, 2025

అన్నమయ్య: నూతన కమిటీ నియామకం

image

అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్.శ్రీలక్ష్మి, పి.రాజేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా యం.గౌరి నియమితులయ్యారు. ఆ సంఘం 2వ జిల్లా మహాసభ మదనపల్లె ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగింది. 13 మంది ఆఫీస్ బేరర్లు, 33మందితో జిల్లా కమిటీ ఏర్పరిచారు.

News November 9, 2025

భద్రాద్రి: ఏ క్యాహై.. ఎమ్మెల్యే సాబ్ జర దేఖో..!

image

చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో మృతి చెందిన వారి అంతిమయాత్రలో బంధువులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కబరస్థాన్ (శ్మశానవాటిక)కు వెళ్లే రోడ్డు మార్గం లోతైన గుంతలతో, బురదమయంగా మారింది. దీంతో గ్రామస్థులు మృతదేహాన్ని భుజాలపై కాకుండా, చేతులపై మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. సమస్య తీవ్రత దృష్ట్యా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పందించి, రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరారు.