News July 29, 2024
BREAKING: పోలవరం MLA కారుపై దాడి

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు జంక్షన్ వద్ద సోమవారం రాత్రి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. రాయి విసరడంతో కార్ అద్దం పగిలినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 13, 2026
ఆకివీడులో ప్రొటోకాల్ ఉల్లంఘించారంటూ కలెక్టర్కు ఫిర్యాదు

ఆకివీడు 13వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఫిర్యాదు చేశారు. నగర పంచాయతీ ఛైర్పర్సన్ హైమావతి, వైసీపీ కౌన్సిలర్లు శ్రీనివాసరెడ్డి, గేదెల అప్పారావు, నాయకులు రుంకాని శ్రీహరిలు ఫిర్యాదు చేశారు. తన వార్డు పరిధిలో కూటమి నాయకులు సీసీ రోడ్డు ప్రారంభంలో ప్రొటోకాల్ ఉల్లంఘించారని, చర్యలు తీసుకోవాలని హైమావతి కలెక్టర్ను కోరారు.
News February 13, 2026
ప.గో: దళారుల చేతిలో తీర ప్రాంత యువత విలవిల

మెరుగైన జీతం కోసం విదేశాలకు వెళ్లాలనే కోస్తా తీర నిరుద్యోగుల ఆశ దళారులకు వరంగా మారుతోంది. ఆయిల్ కంపెనీల్లో భారీ వేతనాలతో ఉద్యోగాలంటూ నమ్మించి నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ముంచుతున్నారు. ఈప్రాంతంలో ఆయిల్ రిగ్గులపై పనిచేసిన అనుభవం ఉన్నవారు ఎక్కువగా ఉండటంతో, దళారులు సులభంగా బుట్టలో వేసుకుంటున్నారు. అప్పులు చేసి డబ్బులు చెల్లించిన యువత, తీరా మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు.
News February 13, 2026
వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలి: కలెక్టర్

ప.గో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒకటి నుంచి 19 ఏళ్ల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని దిశానిర్దేశం చేశారు.


