News February 15, 2026
BREAKING: భువనగిరిలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

భువనగిరి స్వర్ణగిరి ఆలయం సమీపాన తెలంగాణ గురుకుల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన బాల ఆకాష్ అనే పదో తరగతి విద్యార్థి బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 19, 2026
మెదక్: విషాదం.. యువకుడి Suicide

చిలిపిచేడ్ మండలంలోని శిలాంపల్లి గ్రామంలో మన్నే సుధాకర్ (20) అనే యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా మంగళవారం గడ్డిమందు తాగగా, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. చేతికి వచ్చిన కొడుకు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేశారు.
News February 19, 2026
NTR: PPP విధానంలో రోడ్లు.. ఇదెక్కడి కర్మ!

విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 19 రోడ్లను PPP మోడల్లో నిర్మించేందుకు టెండర్లు ఆహ్వానించారు. 23.54 KM విస్తీర్ణంలో సర్కిల్-3లో 9, C-2లో 5, C-1లో 5 రోడ్లు వేయనున్నారు. బడ్జెట్ రూ.151Cr కాగా, 10 ఏళ్లపాటు ప్రైవేటు వ్యక్తులే వీటిని నిర్వహించనున్నారు. VMC వార్షిక బడ్జెట్ రూ.1643 కోట్లు ఉండగా, రోడ్లు కూడా కార్పొరేషన్ వేయకుండా, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News February 19, 2026
పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే..

సాధారణంగానే పిల్లలు కుదురుగా ఉండరు. అదేకాకుండా ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలతో పాటు పెద్దల్లో కూడా అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే.. పిల్లలు చదివేటపుడు పేరెంట్స్ ఫోన్ పట్టుకొని కూర్చోకుండా వారితో కూర్చొని వార్తలు, పుస్తకాలు చదవాలి. దీంతో పిల్లలకు అది అలవాటవుతుంది. అటెన్షన్ బ్రేక్లు ఇవ్వాలి. టైం టేబుల్ తయారుచేసి ఫాలో అవ్వాలి. వారి దృష్టి మరల్చే వస్తువులు దూరంగా ఉంచాలి.


