News March 4, 2025

BREAKING: భువనగిరిలో రోడ్డెక్కిన మహిళలు

image

భువనగిరి మండలం హనుమాపురంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మహిళలు ఆరోపించారు. భువనగిరి-జగదేపూర్ ప్రధాన రహదారిలోని హనుమపురం చౌరస్తా వద్ద మహిళలు బిందెలు పట్టుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పట్టించుకోవాలని కోరారు. మహిళలు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు తాగునీటి ఎద్దడి తీవ్రతను అరికట్టలేకపోతున్నారని వారు మండిపడ్డారు. 

Similar News

News March 4, 2025

అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచుల నిర్వ‌హ‌ణ‌కు స్టేడియం సిద్ధం

image

ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెల‌లో జ‌ర‌గ‌బోయే రెండు ఐపీఎల్ మ్యాచులు విశాఖకు గ‌ర్వ‌కార‌ణంగా నిలిచేలా నిర్వ‌హిస్తామ‌ని ఆంధ్ర‌ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. మంగ‌ళ‌వారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో చేప‌ట్టిన ఆధునీకర‌ణ ప‌నులను క‌లెక్ట‌ర్ హరేంధిర ప్రసాద్‌తో కలిసి ప‌రిశీలించారు. మార్చి 24న ఢిల్లీ -లక్నో, మార్చి 30న ఢిల్లీ -సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

News March 4, 2025

ఐదో రౌండ్ పూర్తి: ముందంజలో బీజేపీ అభ్యర్థి

image

TG: ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి దూసుకెళ్తున్నారు. ఐదు రౌండ్లు ముగిసేసరికి 7,142 ఓట్ల ముందంజలో ఉన్నారు. అంజిరెడ్డికి 38,553, నరేందర్ రెడ్డి (కాంగ్రెస్) 31,411, ప్రసన్న హరికృష్ణ (బీఎస్పీ) 26,300 ఓట్లు సాధించారు.

News March 4, 2025

ఆస్పత్రుల జబ్బుకు చికిత్స ఏది..?

image

అనారోగ్యం పాలైతే బాగు చేసే ఆస్పత్రులకే జబ్బు చేస్తే? ప్రైవేటు ఆస్పత్రులు డబ్బు జబ్బుతో తమ వద్దే మెడిసిన్ కొనాలని, అక్కడ దొరికే మెడిసిన్ మాత్రమే రాసి పేషంట్ల నుంచి డబ్బు దండుకోవడం సాధారణమైంది. ఈ డబ్బు జబ్బు నిజమేనన్న సుప్రీంకోర్టు, పరిష్కారం ఏమిటని, దీనిపై పిల్ వేసిన లాయర్‌ను అడిగింది. అయినా.. ప్రభుత్వాస్పత్రులే సరిగా ఉంటే మనకు ఈ దోపిడీ ఉండేదా? ప్రజా వైద్యం ప్రజలకు అందితేనే ప్రైవేటు దందా తగ్గేది.

error: Content is protected !!