News November 3, 2024

BREAKING: మంత్రి సవిత పర్యటనలో ఉద్రిక్తత

image

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల పర్యటనకు వచ్చిన మంత్రి సవితకు సొంత పార్టీ నుంచే నిరసన వ్యక్తమైంది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కోసం భూమిపూజ చేయడానికి మంత్రి రొద్దం గ్రామానికి రాగా.. మండలానికి చెందిన MP పార్థసారథికి కనీసం ఆహ్వానం ఎందుకు ఇవ్వలేదని MP వర్గీయులు నిలదీశారు. దీంతో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో కొద్ది సేపు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

Similar News

News December 15, 2025

అనంతపురం జిల్లా TDP నేత మృతి

image

అనంతపురం జిల్లా టీడీపీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి, రాయదుర్గం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జి.లోకానంద సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాయదుర్గం పట్టణానికి చెందిన లోకానంద లీగల్ సెల్‌లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన మృతిపై టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

News December 15, 2025

కేఎల్ స్వామి దాస్‌కు డాక్టర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు

image

గుంతకల్లుకు చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కేఎల్ స్వామి దాస్ ఢిల్లీలో ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు’ను అందుకున్నారు. భారతీయ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సుమనాక్షర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. మాదిగలు, అణగారిన కులాల సమస్యల పరిష్కారం కోసం 30 ఏళ్లకు పైగా చేసిన నిస్వార్థ సామాజిక సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు స్వామి దాస్ పేర్కొన్నారు.

News December 15, 2025

కేఎల్ స్వామి దాస్‌కు డాక్టర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు

image

గుంతకల్లుకు చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కేఎల్ స్వామి దాస్ ఢిల్లీలో ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు’ను అందుకున్నారు. భారతీయ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సుమనాక్షర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. మాదిగలు, అణగారిన కులాల సమస్యల పరిష్కారం కోసం 30 ఏళ్లకు పైగా చేసిన నిస్వార్థ సామాజిక సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు స్వామి దాస్ పేర్కొన్నారు.