News September 22, 2025
BREAKING: మల్కాజిగిరిలో పండుగ పూట దారుణం

HYD మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్మెట్ PS పరిధి సాయి నగర్లో పండుగ పూట దారుణం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సాయినగర్లో ఉండే శ్రీనివాస్ కొన్ని రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. నెల క్రితం ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత తల్లిదండ్రులు అతడిని ఇంటికి తీసుకొచ్చారు. ఈక్రమంలో ఈరోజు అతడు కోపంతో తల్లిదండ్రులను దారుణం చంపాడు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు.
Similar News
News September 22, 2025
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి వెళుతున్నారా? మీ కోసమే..!

ప్రసిద్ధి చెందిన HYD జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ ఫౌండర్ పి.విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారు ప్రతి రోజు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నట్లు చెప్పారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. భక్తులు తరలిరావాలని కోరారు. SHARE IT
News September 22, 2025
HYD: ఈ వారానికి మాత్రమే హైడ్రా ప్రజావాణి వాయిదా

హైడ్రా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ఈసారికి మాత్రమే మంగళవారానికి వాయిదా వేసింది. ఈనెల 22న ఉండాల్సిన ప్రజావాణిని 23వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పును గమనించి మంగళవారం నిర్వహించే ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేయాలని హైడ్రా కోరింది. ఈ మార్పు కేవలం ఈ వారానికే మాత్రమే పరిమితమని పేర్కొంది. ఆ తర్వాత వారం నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి ఉంటుందని తెలిపింది.
News September 22, 2025
FLASH: HYD-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద

హయత్నగర్లో HYD-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి సమీప రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులకు మరోసారి ఇబ్బందులు తప్పడం లేదు. అటు దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు బయలు దేరిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.