News March 28, 2025

BREAKING: మహబూబ్‌నగర్: విద్యార్థి ఆత్మహత్య

image

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పీర్ల గుట్ట సమీపంలో ఉండే మణిదీప్(18) ఉదయం పేపర్ బాయ్‌గా పని చేస్తూ.. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 31, 2025

ఏప్రిల్​ 6,7 తేదీల్లో భద్రాచలంలో మద్యం షాపులు బంద్

image

భద్రాద్రి రామాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఏప్రిల్​ 6,7 తేదీల్లో భద్రాచలంలో మద్యం షాపులను మూసివేయాలని ఇప్పటికే కలెక్టర్​ఆదేశించారు. ఏప్రిల్​6న సీతారాముల కళ్యాణం, 7న పట్టాభిషేకం జరుగుతాయి. ఎండల నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేలా ఫాగ్, 50 టన్నుల భారీ ఏసీ, వంద కూలర్లు, 250 ఫ్యాన్లను అమర్చుతున్నారు. 2 వేల మంది పోలీసులతో ఎస్పీ రోహిత్​రాజ్​, ఏఎస్పీ విక్రాంత్ ​కుమార్ సింగ్ భద్రతా ఏర్పాట్లు చేశారు.

News March 31, 2025

CSK ‘ధోనీ’ని వదులుకోలేక!

image

ధోనీ ఉంటేనే CSK. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతోంది. ప్రస్తుతం ధోనీ బ్యాటింగ్ చూస్తే సగటు చెన్నై ఫ్యాన్‌కి అసహనం కలుగుతోంది. బ్యాటింగ్‌లో మేనేజ్మెంట్ ధోనీకి స్వేచ్ఛనివ్వగా యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ రావట్లేదని పలువురు ఫ్యాన్స్ అంటున్నారు. అటు శరీరం సహకరించక MS ఆలస్యంగా బ్యాటింగ్‌కు వస్తున్నారని కోచ్ ఫ్లెమింగ్ చెప్పారు. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయలేక పరిస్థితిని బట్టి క్రీజులోకి వస్తున్నారని తెలిపారు.

News March 31, 2025

విశాఖ: యువకుడిపై కోపంతో బైక్‌లకు నిప్పు పెట్టిన యువతి

image

విశాఖలోని సింగ్ హోటల్ జంక్షన్ సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో శుక్రవారం అర్ధరాత్రి 18 బైకులు దగ్ధమైన విషయం తెలిసిందే. అయితే ఓ యువతి ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ వ్యక్తితో విభేదాల కారణంగా అతని బైక్‌‌కు నిప్పు పెట్టగా ఆ మంటలు మిగతా బైక్‌లకు కూడా అంటుకుని దగ్ధమయ్యాయి. సదరు మహిళ ఆ యువకుడిని గతంలో ప్రేమించిందని అతడికి వేరొకరితో పెళ్లి కావడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

error: Content is protected !!