News February 11, 2025

BREAKING.. ములుగు: పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య

image

ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆలెం స్వామి, అశ్విత మృతి చెందారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 11, 2025

దేశంలో ‘శాంసంగ్’ డౌన్.. టాప్‌లో వివో

image

దేశీయ మార్కెట్‌లో శాంసంగ్ హవాకు బ్రేక్ పడింది. 2024లో ఆ సౌత్ కొరియా కంపెనీ వాటా 17 నుంచి 13.2 శాతానికి పడిపోయి రెండో స్థానంలో నిలిచింది. వివో(చైనా) 15.2 నుంచి 16.6 శాతానికి చేరి టాప్‌లో నిలిచినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ వెల్లడించింది. ఐఫోన్ మార్కెట్ 6.4 నుంచి 8.2 శాతానికి చేరినట్లు తెలిపింది. 3-10 స్థానాల్లో వరుసగా OPPO, షియోమీ, రియల్‌మి, ఆపిల్, మోటొరోలా, POCO, వన్‌ప్లస్, ఐక్యూ ఉన్నాయంది.

News February 11, 2025

MBNR: ఎన్నికల నిర్వహణపై శిక్షణ 

image

ZPTC, MPTC గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాస్టర్ ట్రైనర్లుగా నియమించిన వారు ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నిర్వహణ నిబంధనలపై అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం ZP సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లు మండల స్థాయి ట్రైనర్లకు ZPTC, MPTC గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

News February 11, 2025

నాంపల్లి: జబల్‌పూర్ ప్రమాద ఘటనపై కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి

image

జబల్‌పూర్‌లో జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో ఏడుగురు హైదరాబాద్ వ్యక్తులు మృతిచెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి.. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని కోరినట్లు తెలిపారు. గాయపడిన ఇద్దరికి సరైన చికిత్స అందించాలని సూచించామన్నారు.

error: Content is protected !!