News February 11, 2025

BREAKING.. ములుగు: పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య

image

ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆలెం స్వామి, అశ్విత మృతి చెందారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 22, 2026

రాజమండ్రి: కలెక్టర్ ప్రకటన.. రేపు యథావిధిగా..

image

తూ.గో. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక), రెవెన్యూ క్లినిక్ సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. డివిజన్, మండల స్థాయిలలో కూడా మీకోసం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. ఆయా ప్రాంతాల్లో ఆర్డీవోలు, తహశీల్దార్లు ఆయా ప్రధాన కార్యాలయం నుంచి హాజరావుతారని వెల్లడించారు.

News February 22, 2026

ఈనెల 23న ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

పుట్టపర్తి కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్, మున్సిపాలిటీ కార్యాలయాలలోనూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు.

News February 22, 2026

BELలో మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీయల్ ట్రైనీ పోస్టులు

image

చెన్నైలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>)2 మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీయల్ ట్రైనీ(ఫైనాన్స్) పోస్టులను భర్తీ చేయనుంది. CMA/CA(ఇంటర్మీడియట్) అర్హతగల వారు మార్చి 9న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మొదటి ఏడాది నెలకు స్టైపెండ్ రూ.25K, రెండో ఏడాది రూ.27K, మూడో ఏడాది రూ.30K చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in