News January 18, 2025

BREAKING.. మెదక్: అన్నను చంపిన తమ్ముడు

image

మెదక్ జిల్లా శివంపేట మండలం నాను తండాలో తమ్ముడు అన్నను హత్య చేశాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన అన్నదమ్ములు శంకర్ (28), గోపాల్ రాత్రి ఒకే రూంలో పడుకున్నారు. తెల్లవారుజామున అన్న కాలికి కరెంట్ వైర్ చుట్టి విద్యుత్ షాక్ పెట్టాడు. శంకర్ కేకలు వేయడంతో గోపాల్ పారిపోయాడు. తండ్రి వచ్చి చూసే వరకే శంకర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 8, 2026

మెదక్: తీవ్ర విషాదం.. బురదలో రైతు మృతి

image

కౌడిపల్లి మండలంలో మర్రి చెట్టు తండాలో పొలంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు బురదలో పడి గిరిజన రైతు మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మర్రి చెట్టు తండా చెందిన కాట్రోత్ దినాకర్(28) తన పొలంలో వరి నాటు కోసం పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు జారి బురదలో పడిపోయాడు. స్థానిక రైతులు చూసి దినాకర్‌ను లేపి చూడగా, అప్పటికే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

News January 8, 2026

గ్రామాభివృద్ధిలో కార్యదర్శులదే కీలక పాత్ర: కలెక్టర్

image

గ్రామాల ప్రగతిలో పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలకంగా వ్యవహరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక క్రమశిక్షణతో పంచాయతీ నిధులను వినియోగించి అభివృద్ధి సాధించాలన్నారు. పన్నుల వసూళ్లలో వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని, ఈనెల 8 నుంచి 11 వరకు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 8, 2026

గ్రామాభివృద్ధిలో కార్యదర్శులదే కీలక పాత్ర: కలెక్టర్

image

గ్రామాల ప్రగతిలో పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలకంగా వ్యవహరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక క్రమశిక్షణతో పంచాయతీ నిధులను వినియోగించి అభివృద్ధి సాధించాలన్నారు. పన్నుల వసూళ్లలో వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని, ఈనెల 8 నుంచి 11 వరకు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.