News January 15, 2026
BREAKING: మెదక్: చేగుంటలో MURDER

మెదక్ జిల్లా చేగుంట(M) అనంతసాగర్ గ్రామ శివారులో గురువారం ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. గ్రామ శివారులోని రైస్ మిల్ సమీపంలో స్థానిక సప్తగిరి కంపెనీలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన MD.సిరాజ్ (35) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Similar News
News March 5, 2026
TU రిజిస్ట్రార్ చాంబర్ వద్ద బోధనేతర సిబ్బంది ధర్నా

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ TU విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది గురువారం రిజిస్ట్రార్ చాంబర్ ముందు ధర్నా నిర్వహించారు. టైమ్ స్కేల్ వేతనాలు వర్తింపజేయాలని, ప్రతి నెలా పీఎఫ్, ఈఎస్ఐ సకాలంలో జమ చేయాలని కోరారు. లోకల్ ఏజెన్సీ కాకుండా రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారానే జీతాలు చెల్లించాలని, బయోమెట్రిక్ విధానాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
News March 5, 2026
కొత్తగూడకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల..?

కొత్తగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక చదువు మానేస్తున్నారు. ఈ నేపథ్యంలో, విద్యార్థుల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం జూన్ మాసం నుంచే విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
News March 5, 2026
వనపర్తి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసి విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశామన్నారు. గ్రామ, పట్టణాల్లో ప్రజలకు లబ్ధి చేకూర్చిన సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు.


