News March 15, 2026
BREAKING: మొయినాబాద్లో కాల్పుల కలకలం

TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఈగల్ టీమ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఫైరింగ్ చేసినట్లు తెలుస్తోంది. తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారని సమాచారం. ఈ పార్టీలో కొందరు రాజకీయ నేతలు పాల్గొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పలువురిని అరెస్టు చేసి, డ్రగ్స్ సీజ్ చేశారని తెలుస్తోంది.
Similar News
News April 2, 2026
రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు!

తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు పడతాయని IMD వెల్లడించింది. గురువారం నుంచి శనివారం వరకు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఆదివారం మధ్య తెలంగాణలోని నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రమంతటా వానలు పడే అవకాశముందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ఆస్కారముందని హెచ్చరించింది. పలుచోట్ల వడగళ్ల వాన పడుతుందని అంచనా వేసింది.
News April 2, 2026
బేర్ పంజా: నిన్న లాభాలు.. నేడు భారీ నష్టాలు

పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. నిన్న లాభాలతో ముగియగా, ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లు నష్టపోయి 71,728 వద్ద ఉంది. అటు నిఫ్టీ 430 పాయింట్లు కోల్పోయి 22,251 వద్ద కొనసాగుతోంది. టెక్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగ సంస్థల షేర్లన్నీ నష్టాలు చవిచూస్తున్నాయి.
News April 2, 2026
హనుమాన్ జయంతి.. ఇలా చేస్తే మనశ్శాంతి!

నేడు చైత్ర పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇవాళ ఆంజనేయుడి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయాలి. బలం, భక్తికి నిదర్శనమైన పవన సుతుడిని కొలవడం వల్ల కష్టాలు తొలగి, మనశ్శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. అంజన్న భక్తులు నేటి నుంచి మే 12 వరకు 41 రోజుల పాటు దీక్షను తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.


