News January 13, 2026
BREAKING: యాదాద్రి: అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు

భూరిజిస్ట్రేషన్ల ఛార్జీల చెల్లింపుల్లో అక్రమాలపై యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, వలిగొండ PSలలో తహశీల్దార్లు ఈరోజు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ల ఫిర్యాదు మేరకు 4 PSలల్లో ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు, డాక్యుమెంట్ రైటర్లు 19 మందిపై కేసులు నమోదు చేశారు. వలిగొండ రూ.15 లక్షలు యాదగిరిగుట్ట రూ.72 లక్షలు, బొమ్మలరామారంలో రూ.25 లక్షలు, తుర్కపల్లిలో రూ.14 లక్షలు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారన్నారు.
Similar News
News February 2, 2026
శ్రీవారి ఆలయం వద్ద సరికొత్త టెక్నాలజీ

AP: తిరుమలలో భద్రతను పటిష్ఠం చేసేందుకు టీటీడీ అత్యాధునిక ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఈ కెమెరాలు భక్తుల రద్దీని అంచనా వేయడంతో పాటూ వాహన సేవల దర్శనాలపై కచ్చితమైన సమాచారాన్ని అందించనున్నాయి. వీటిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
News February 2, 2026
కరీంనగర్కు దక్కని ‘పద్దు’ ఊరట

KNRకు బడ్జెట్లో మరోసారి నిరాశే ఎదురైంది. స్మార్ట్ సిటీకి నిర్మలమ్మ ‘పద్దు’ కరుణించలేదు. ఏళ్ల తరబడి ఊరిస్తున్న హసన్పర్తి రైల్వే లైన్, గ్రానైట్ పరిశ్రమకు ప్రోత్సాహకాలు వంటి అంశాలపై స్పష్టత కరువైంది. టెక్స్టైల్ రంగానికి కొంత ఊరట ఉన్నా, జిల్లాకు ప్రత్యేక పారిశ్రామిక కేటాయింపులు లేకపోవడంతో నిరుద్యోగులు, పారిశ్రామికవేత్తలు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్ నిరాశ కల్పించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
News February 2, 2026
350 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 350 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి CFA/CA, MBA, PGDBM, PGDBA, CAIIB, IIBF, CITF, NISM సర్టిఫికెట్తో పాటు పని అనుభవం ఉండాలి. FEO పోస్టుకు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టుకు 30ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://centralbank.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


