News November 21, 2025
BREAKING: వరంగల్: ముగ్గురు ఇన్స్పెక్టర్లు బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఈరోజు ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన వారిలో మామూనూర్ ఇన్స్పెక్టర్ ఓ.రమేశ్ వీఆర్కు బదిలీ కాగా, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ ఈ.శ్రీనివాస్ మామూనూర్కు బదిలీ అయ్యారు. వీఆర్లో విధులు నిర్వహిస్తున్న ఏ.ప్రవీణ్ ఐటీ కోర్ సెల్కు బదిలీ అయ్యారు.
Similar News
News November 21, 2025
నర్సంపేట: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి ఐదు రోజుల జైలు శిక్ష

నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 19న పట్టణంలోని అంగడి సెంటర్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటో నడుపుతున్న పట్టణానికి చెందిన మేకల మహేందర్ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు మహేందర్ను నర్సంపేట న్యాయస్థానంలో హాజరు పరచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీనారాయణ ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు.
News November 21, 2025
వేములవాడ బీజేపీకి షాక్.. కాంగ్రెస్లో చేరిన 50 మంది

వేములవాడ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు, వేములవాడ ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు సరిపల్లి కార్తీక్, లిక్కి జితేందర్ ఆధ్వర్యంలో వారి మిత్రబృందం మొత్తం 50 మంది శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
News November 21, 2025
నిరంతర తనిఖీలు చేయాలి: మంత్రి

రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రవాణా శాఖ అమలు చేస్తున్న సంస్కరణలు మరింత కఠినతరం చేసేలా ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి, మరణాల రేటును నివారించే విధంగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ కోసం కొత్తగా ఏర్పడిన 33 జిల్లా స్థాయి బృందాలు, 3 రాష్ట్ర స్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ నిరంతర తనిఖీలు చేపట్టాలని సూచించారు.


