News April 8, 2025
BREAKING..శామీర్పేట్లో ఘోర రోడ్డు ప్రమాదం

శామీర్పేట్లోని జీనోమ్ వ్యాలీ PS పరిధిలో లాల్గడి మలక్పేట్ హైవేపై సఫారీ కారు డీసీఎం ఢీ కొన్నాయి. సఫారీ వాహనం సిద్దిపేట నుంచి నగరానికి వస్తుండగా డివైడర్కు తగిలి ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు సిద్దిపేట జిల్లా వర్గల్కు చెందిన రాజు, తుర్కపల్లి పరిధి మురహరిపల్లికి చెందిన శ్రవణ్లుగా పోలీసులు గుర్తించారు.
Similar News
News October 21, 2025
టీషర్టులపై ఆధార్ కార్డుల ప్రింటింగ్.. ఎందుకంటే?

నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మత్స్యకారులు పోరాటం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజయ్యపేట వెళ్లే అన్ని దారుల్లో చెక్పోస్ట్లు ఏర్పాటు చేశారు. గ్రామానికి వెళ్లేవారిని ఆధార్ కార్డులు చూపించమని అడుగుతున్నారు. దీంతో మత్స్యకారులు టీషర్ట్లపై ఆధార్ కార్డు, బల్క్డ్రగ్ వ్యతిరేక పోరాటం స్లోగన్ ప్రింట్ చేయించుకుని అవి వేసుకుని తిరుగుతున్నారు.
News October 21, 2025
పల్నాడుకు మణిహారం.. నాగార్జునసాగర్ విమానాశ్రయం

ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్లో 1670 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం నిర్మించనున్న విమానాశ్రయం పల్నాడుకు మణిహారం కానున్నది. నాగార్జునసాగర్ ప్రాంతంలో బౌద్ధ మతం విస్తరించింది. అప్పట్లో ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయం నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సమీపంలో అనుపు, ఎత్తిపోతల పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. బౌద్ధమతం విలసిల్లడంతో బౌద్ధ దేశాల నుంచి యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నారు.
News October 21, 2025
సైబర్ క్రైమ్ గ్యాంగ్ లీడర్.. కేరాఫ్ చాయ్వాలా

బిహార్లో అభిషేక్ కుమార్ అనే చాయ్వాలా అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నెట్వర్క్ లీడర్గా తేలాడు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో సైబర్ నేరాలకు పాల్పడిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అభిషేక్ ఇంట్లో సోదాలు చేపట్టి రూ.1.05 కోట్ల నగదు, 344గ్రా. గోల్డ్, 1.75KGs సిల్వర్ సీజ్ చేశారు. 85 ATM కార్డులు, 75 బ్యాంక్ పాస్బుక్స్, 28 చెక్బుక్స్, ఆధార్ కార్డ్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్, లగ్జరీ కారు స్వాధీనం చేసుకున్నారు.