News December 17, 2025
BREAKING: సంగారెడ్డి జిల్లాలో తొలి ఫలితం

నాగలిగిద్ద మండలం శమా తండా సర్పంచిగా మారుతి మహారాజ్ విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మారుతి మహారాజ్ సమీప ప్రత్యర్థిపై 63 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Similar News
News December 18, 2025
నిర్మల్: ఈనెల 29, 30వ తేదీల్లో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్

జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహణ తేదీల్లో మార్పులు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా, క్రిస్మస్ సెలవుల అనంతరం ఈనెల 29 30 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని జిల్లాలోని అన్ని మండల విద్యాధికారులు, అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News December 18, 2025
క్లౌడ్, ఆన్లైన్ లైబ్రరీలో భూ రికార్డులు: CBN

AP: భూ రికార్డుల ఆర్కైవ్స్నూ మేనేజ్ చేస్తున్నారని వీటికి చెక్ పెట్టాల్సిన అవసరముందని CM CBN అభిప్రాయపడ్డారు. అన్ని భూ రికార్డులు క్లౌడ్ స్టోరేజీలో ఉంచడం మంచిదని కలెక్టర్ల సదస్సులో సూచించారు. రికార్డులు ఆన్లైన్ లైబ్రరీలో ఉంచితే మ్యానిపులేషన్కు తావుండదన్నారు. 3 మెంబర్ కమిటీ సూచించిన 6 పద్ధతులు గేమ్ ఛేంజర్లు అవుతాయని చెప్పారు. సంస్కరణల వల్ల 10 ని.లలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతోందన్నారు.
News December 18, 2025
భద్రాద్రిలో కాంగ్రెస్ హవా.. 271 పంచాయతీల్లో విజయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 విడతల్లో జరిగిన జీపీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 469 సర్పంచ్ స్థానాలకు గాను కాంగ్రెస్ మద్దతుదారులు 271 చోట్ల ఘనవిజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం BRS 105 స్థానాలకు పరిమితం కాగా, స్వతంత్రులు, ఇతరులు 93 స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే, జిల్లాలో BJP ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకవడం గమనార్హం.


