News February 13, 2025

BREAKING: 19 మంది మావోయిస్టుల లొంగుబాటు

image

భద్రాద్రి: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 19 మంది జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను చూసి స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ప్రకటించారు. లొంగిపోయి సాధారణ జీవితం గడపటానికి వారు ముందుకు వచ్చారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, ఏఎస్పీ విక్రాంత్ పాల్గొన్నారు.

Similar News

News March 27, 2025

కన్నడిగులకు మరో షాక్!

image

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పాల ధరలను లీటరుకు రూ.4 పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మిల్క్ ధరలను లీటరుకు రూ.5 పెంచాలని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) కోరగా సీఎం సిద్దరామయ్య రూ.4 పెంచేందుకు అంగీకరించారు. ఇటీవలే అక్కడ కరెంట్ ఛార్జీలను పెంచారు. 6 గ్యారంటీలే ధరల పెరుగుదలకు కారణమని విపక్షాలు మండిపడుతున్నాయి.

News March 27, 2025

గూడూరులో డెడ్‌ బాడీ కలకలం

image

గూడూరు పట్టణ శివారులోని టిడ్కో ఇళ్ల సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం ఇవాళ కలకలం రేపింది. టిడ్కో గృహాల పక్కనే ఉన్న కంపచెట్ల పొదల్లో ఓ మృతదేహం కుళ్లిపోయి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారం రోజుల క్రితం ఓ మహిళ తన కుమారుడు సోహెల్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఉన్నారు. పోలీసులు సోహెల్ మృతదేహంగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 27, 2025

KNR: వారధి సొసైటీ ద్వారా 2,997 మందికి ప్రత్యక్ష ఉపాధి: కలెక్టర్

image

వారధి సొసైటీ 10వ వార్షిక సర్వసభ్య సమావేశం కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో సొసైటీ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో వారధి సొసైటీ 2015 లో ప్రారంభమైందని అన్నారు. 2 వేల 997 మంది ఈ సంస్థ ద్వారా ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ ఏడాది 186 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!