News March 28, 2025
BREAKING: 2 శాతం డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఉగాది కానుక ఇచ్చింది. 2 శాతం డీఏ పెంపునకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వారి డీఏ 53 నుంచి 55 శాతానికి చేరింది. ఏడో వేతన సవరణ సంఘం సూచనతో ఈ పెంపు లభించింది.
Similar News
News October 29, 2025
డౌన్స్ సిండ్రోమ్ పిల్లలకు ఈ పరీక్షలు చేయిస్తున్నారా?

డౌన్స్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు క్రమం తప్పకుండా కొన్ని వైద్య పరీక్షలు చేయించాలని వైద్యులు చెబుతున్నారు. ఏడాదికోసారి కంటి పరీక్షలు, 6-12 నెలలకు ఒకసారి చెవి పరీక్షలు చేయించాలి. ప్రతి ఆర్నెల్లకోసారి దంత పరీక్షలు, 3-5 ఏళ్లకోసారి ఛాతీ, మెడ భాగాన్ని ఎక్స్రే తీసి పరీక్షిస్తూ ఉండాలి. అమ్మాయిల్లో యుక్త వయసు రాగానే పాప్ స్మియర్ పరీక్ష, సంవత్సరానికోసారి థైరాయిడ్ పరీక్ష చేయిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.
News October 29, 2025
49 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఘజియాబాద్లో 49 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్-C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్, ITI, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590, SC/ST/PWBDలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://bdl-india.in/
News October 29, 2025
సినిమాల్లోకి మహేశ్ బాబు మేనకోడలు!

సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మంజుల కుమార్తె జాన్వీ స్వరూప్ త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మహేశ్ మేనకోడలు మూవీల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ SMలో ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. గతంలో ‘మనసుకు నచ్చింది’ చిత్రంలో జాన్వీ చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. మూవీస్లోకి రావాలని ఆమె డ్రైవింగ్, డాన్స్, ఫిట్నెస్ వంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం.


