News December 28, 2024

BREAKING: 108 సిబ్బందికి అదనంగా రూ.4,000

image

AP: 108, 104 సేవలకు ఇకపై సింగిల్ సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. 190 కొత్త 108 వాహనాలు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. 108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా రూ.4వేలు ఇవ్వాలని సూచించారు. దీంతో పాటు 58 మహాప్రస్థానం వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని, ప్రతి మండలంలో జనఔషధి స్టోర్స్ ఏర్పాటు చేయాలని వైద్య శాఖపై సమీక్షలో వెల్లడించారు.

Similar News

News November 15, 2025

OFFICIAL: CSK కెప్టెన్‌‌గా గైక్వాడ్

image

IPL 2026 కోసం CSK కెప్టెన్‌ను ఆ జట్టు యాజమాన్యం కన్ఫామ్ చేసింది. తదుపరి సీజన్‌కు తమ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ ఉంటారని X వేదికగా వెల్లడించింది. దీంతో సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా ప్రకటిస్తారనే ఊహాగానాలకు తెరదించినట్లైంది. CSK సంజూ శాంసన్‌ను తీసుకుని, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌ను RRకు ఇచ్చి ట్రేడ్ డీల్ చేసుకున్న విషయం తెలిసిందే.

News November 15, 2025

CM పీఠంపై సందిగ్ధం.. రేపు MLAలతో నితీశ్ భేటీ

image

బిహార్ ఎన్నికల్లో NDA 202 సీట్లతో బంపర్ మెజారిటీ సాధించింది. అయితే CM పదవిపై కూటమిలో ఇంకా సందిగ్ధతే ఉంది. ఈ తరుణంలో సీఎం పీఠాన్ని ఆశిస్తున్న నితీశ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం భేటీ కానున్నారు. ‘CM పోస్టుకు వివాదరహిత వ్యక్తి నితీశ్ మాత్రమే అర్హుడు. బిహార్లో ప్రత్యామ్నాయం ఎవరూ లేరు’ అని JDU MLAలు పేర్కొంటున్నారు. కాగా ఫలితాల అనంతరం LJP నేత చిరాగ్ సహా అనేకమంది నితీశ్ నివాసానికి పోటెత్తారు.

News November 15, 2025

రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ వెంటే: మహేశ్ కుమార్

image

TG: కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై సంతృప్తితోనే ప్రజలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీని గెలిపించారని PCC చీఫ్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు సాధిస్తామని చెప్పారు. BCలకు 42% రిజర్వేషన్లపై CONG కమిట్మెంటుతో ఉందని, బీజేపీయే అడ్డుపడుతోందని విమర్శించారు. కాగా CM రేవంత్, DyCM భట్టి, మహేశ్‌, ‘జూబ్లీ’ విజేత నవీన్ ఇతర నేతలు ఢిల్లీలో పార్టీ పెద్దల్ని కలిశారు.