News December 15, 2024
శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి.. త్వరలో కలుస్తా: బన్నీ

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని అల్లు అర్జున్ ఆకాంక్షించారు. ‘ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో నేను శ్రీతేజ్ని, అతని కుటుంబాన్ని కలవకూడదని న్యాయ నిపుణులు చెప్పారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. శ్రీతేజ్ ఆస్పత్రి, కుటుంబ అవసరాలకు అండగా ఉంటాననే హామీకి కట్టుబడి ఉన్నా. సాధ్యమైనంత త్వరగా శ్రీతేజ్ని కలిసేందుకు ప్రయత్నిస్తా’ అని Xలో పోస్ట్ చేశారు.
Similar News
News January 21, 2026
జగిత్యాల: రైతు గోస పట్టదా? పాలకుల హామీలు నీటి మూటలే!

జిల్లా రైతులను ప్రధాన సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఎన్నికలు ఎన్ని వచ్చినా అన్నదాతలకు ఒరిగిందేమీ లేదు. జిల్లాలో ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. ఐతే పసుపు బోర్డుతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అలాగే జిల్లాలో ఉన్న ఒకే ఒక్క చక్కెర ఫ్యాక్టరీ మూత పడింది. కాలువలు మరమ్మతు చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు SRSP నీరు అందటం లేదు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కారంచాలని రైతులు కోరుతున్నారు.
News January 21, 2026
నేటి ముఖ్యాంశాలు

* BJP జాతీయాధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణం
* నితిన్ నా బాస్.. నేను కార్యకర్తను మాత్రమే: మోదీ
* దావోస్లో గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ
* ఫోన్ ట్యాపింగ్ కేసులో 7 గంటలపాటు హరీశ్ రావును విచారించిన సిట్
* హరీశ్ విచారణపై INC-BRS నేతల మధ్య డైలాగ్ వార్
* పెండింగ్ చలాన్లపై బలవంతం చేయొద్దు: TG హైకోర్టు
* ఇవాళ రూ.22వేలు పెరిగిన కేజీ వెండి ధర, రూ.1.52లక్షలకు చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం
News January 21, 2026
మే నెలలో సముద్రంలోకి మత్స్య-6000

సముద్ర గర్భ రహస్యాల అన్వేషణలో భారత్ కీలక అడుగు వేయబోతుంది. ‘సముద్రయాన్’ ప్రాజెక్టులో భాగంగా చెన్నై NIOT కేంద్రంలో తయారైన నాలుగో తరం సబ్మెరైన్ ‘మత్స్య-6000’ను మే నెలలో సముద్రంలోకి ప్రవేశపెట్టనున్నారు. డీప్ ఓషియన్ మిషన్ (DOM) కింద రూపొందిన ఈ సబ్మెరైన్లో 500 మీటర్ల లోతు వరకు ముగ్గురు ఆక్వానాట్స్ ప్రయాణిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే US, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ సరసన భారత్ నిలుస్తుంది.


