News December 15, 2024
శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి.. త్వరలో కలుస్తా: బన్నీ

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని అల్లు అర్జున్ ఆకాంక్షించారు. ‘ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో నేను శ్రీతేజ్ని, అతని కుటుంబాన్ని కలవకూడదని న్యాయ నిపుణులు చెప్పారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. శ్రీతేజ్ ఆస్పత్రి, కుటుంబ అవసరాలకు అండగా ఉంటాననే హామీకి కట్టుబడి ఉన్నా. సాధ్యమైనంత త్వరగా శ్రీతేజ్ని కలిసేందుకు ప్రయత్నిస్తా’ అని Xలో పోస్ట్ చేశారు.
Similar News
News February 20, 2026
రాముడిగా మహేశ్ బాబు.. లుక్ అదిరిందిగా!

వారణాసిలో శ్రీరాముడిగా సూపర్స్టార్ మహేశ్ బాబు లుక్ వైరలవుతోంది. గుంటూరులోని మైత్రీ సినిమాస్లో ఏర్పాటు చేసిన డిజిటల్ పోస్టర్ను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ధనుస్సుతో శ్రీరాముడిగా మహేశ్ బాబు పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వారణాసి టీమ్ ఇంకా దీనిపై అధికారికంగా అప్డేట్ రిలీజ్ చేయాల్సి ఉంది. ఈ సినిమాలో మహేశ్ రాముడి పాత్రలో కనిపిస్తారని రాజమౌళి గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
News February 20, 2026
33 మంది మైనర్లపై లైంగిక వేధింపులు.. స్పెషల్ కోర్టు సంచలన తీర్పు

పోక్సో కేసులో UP స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2010 నుంచి పదేళ్లపాటు 33 మంది మైనర్లను లైంగికంగా హింసించిన దంపతులు రామ్, దుర్గావతికి మరణశిక్ష విధించింది. ఆ 33 మందికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిందితులు చాక్లెట్ల ఆశచూపి మైనర్లను దారుణంగా వేధిస్తూ వీడియోలను చిత్రీకరించి డార్క్వెబ్లో అమ్మేవారు. పాపం పండటంతో 2020లో వారిని సీబీఐ అరెస్టు చేసింది.
News February 20, 2026
గుజరాత్లో పారిపోయిన జంటల వివాహ నమోదు కఠినతరం

పారిపోయిన జంటల వివాహ రిజిస్ట్రేషన్ల రూల్స్ను కఠినతరం చేయనున్నట్లు గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘవి ప్రకటించారు. ‘లవ్ జిహాద్’ కేసులు పెరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘దేశంలో వివాహం ఓ పవిత్ర ఆచారం. మన కుమార్తెలను తప్పుడు పేర్లతో మోసం చేస్తే సంస్కృతిపై ప్రభావం పడుతుంది. అది సమాజ పతనానికి దారితీస్తుంది. వివాహ పవిత్రతను కాపాడటమే మా లక్ష్యం’ అని స్పష్టం చేశారు.


