News December 15, 2024
శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి.. త్వరలో కలుస్తా: బన్నీ

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని అల్లు అర్జున్ ఆకాంక్షించారు. ‘ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో నేను శ్రీతేజ్ని, అతని కుటుంబాన్ని కలవకూడదని న్యాయ నిపుణులు చెప్పారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. శ్రీతేజ్ ఆస్పత్రి, కుటుంబ అవసరాలకు అండగా ఉంటాననే హామీకి కట్టుబడి ఉన్నా. సాధ్యమైనంత త్వరగా శ్రీతేజ్ని కలిసేందుకు ప్రయత్నిస్తా’ అని Xలో పోస్ట్ చేశారు.
Similar News
News December 30, 2025
ఓవర్ స్పీడ్ ఫైన్ రూ.73,500.. యాక్సిడెంట్ల నియంత్రణకు ఇదే మార్గమా?

యూఏఈలోని దుబాయ్లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారులకు భారీగా జరిమానాలు విధిస్తారు. ఓవర్ స్పీడ్ రూ.73,500, సిగ్నల్ జంప్ రూ.24,500, ఫోన్ వాడితే రూ.19,500, సీట్ బెల్ట్ లేకుంటే రూ.9,800 ఫైన్ వేస్తారు. మన దేశంలోనూ రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ఇలాంటి జరిమానాలు విధించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫైన్స్ కంటే ముందు దుబాయ్లా రోడ్లు వేయాలని మరికొందరు సూచిస్తున్నారు. మీ COMMENT?
News December 30, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే ఆఖరు తేదీ

HYDలోని CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(<
News December 30, 2025
బంగ్లా మాజీ ప్రధాని మృతి.. మోదీ దిగ్భ్రాంతి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మరణంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి, బంగ్లా ప్రజలకు సంతాపం తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. బంగ్లా మొదటి మహిళా ప్రధానిగా ఆమె ఇండియాతో సంబంధాలు, అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు. 2015లో ఖలీదాతో సమావేశమయ్యానని గుర్తు చేసుకున్నారు.


