News December 15, 2024

శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి.. త్వరలో కలుస్తా: బన్నీ

image

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని అల్లు అర్జున్ ఆకాంక్షించారు. ‘ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో నేను శ్రీతేజ్‌ని, అతని కుటుంబాన్ని కలవకూడదని న్యాయ నిపుణులు చెప్పారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. శ్రీతేజ్ ఆస్పత్రి, కుటుంబ అవసరాలకు అండగా ఉంటాననే హామీకి కట్టుబడి ఉన్నా. సాధ్యమైనంత త్వరగా శ్రీతేజ్‌ని కలిసేందుకు ప్రయత్నిస్తా’ అని Xలో పోస్ట్ చేశారు.

Similar News

News February 11, 2026

రెండో సూపర్ ఓవర్.. SA స్కోర్ ఎంతంటే?

image

T20WC: అఫ్గాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్‌లో SA 23 రన్స్ చేసింది.
బాల్ బై బాల్ స్కోర్: 6, 1, 2, 6, 6, 2

News February 11, 2026

యూజర్లు మోసపోకుండా ఎయిర్‌టెల్ స్పెషల్ ఫీచర్!

image

బ్యాంకింగ్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించేందుకు ఎయిర్‌టెల్ సరికొత్త AI ఫ్రాడ్ అలర్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. మోసగాళ్లు ఫోన్ చేసినప్పుడు ఈ సాంకేతికత వారిని వెంటనే గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా OTP చెప్పవద్దని ముందే హెచ్చరిస్తుంది. దీనివల్ల సామాన్యుల డబ్బు సురక్షితంగా ఉంటుంది. నెట్‌వర్క్ స్థాయిలో పనిచేసే ఈ సాంకేతికత బ్యాంకింగ్ మోసాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించనుంది.

News February 11, 2026

నువ్వుల చేనులో మనుషులతో కలుపుతీత – లాభాలు

image

నువ్వుల పంటలో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. పంట విత్తిన 15-20 రోజుల లోపు చేనులో అదనపు మొక్కలను తొలగించాలి. విత్తిన 25-30 రోజుల తర్వాత మందులతో కలుపును నివారించకుండా మనుషులతో కలుపు తీయించాలి. దీని వల్ల కలుపు మొక్కలు నశించడమేకాకుండా భూమి గుల్లబారి ఎక్కువ తేమ భూమిలో నిల్వ ఉంటుంది. ఫలితంగా పంట త్వరగా నీటి ఎద్దడికి గురికాదు. విత్తనాలను వరుసల్లో విత్తితే చేనులో కలుపు తీయడానికి అనుకూలంగా ఉంటుంది.