News June 4, 2024

Breaking: 6 లక్షల ఓట్ల ఆధిక్యంలో అమిత్ షా

image

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నారు. గుజరాత్ గాంధీనగర్ నుంచి ఆయన పోటీ చేశారు. 3 గంటల ప్రాంతంలో 6,50,399 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకారం ఆయనకు 8,58,197 ఓట్లు వచ్చాయి. మరికొద్ది సేపట్లో ఆయన గెలుపు వార్తలు రావొచ్చు. కాగా గుజరాత్‌లో బీజేపీ 26కు 25 సీట్లలో దుమ్మురేపుతోంది.

Similar News

News December 30, 2025

సంక్రాంతికి టోల్‌ప్లాజాల వద్ద రద్దీ లేకుండా చర్యలు: కోమటిరెడ్డి

image

TG: టోల్ ప్లాజాల వద్ద రద్దీ లేకపోతే అసౌకర్యం ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతికి నేషనల్ హైవేలపై రద్దీ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. ‘CM ఈ అంశంపై సీరియస్‌గా ఉన్నారు. సంక్రాంతికి టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాస్తాను. మేడారం జాతరకు వెళ్లే లక్షలాది భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరతాను’ అని తెలిపారు.

News December 30, 2025

సూర్యకుమార్ మెసేజ్‌ చేసేవాడు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు!

image

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ‘MTV స్ప్లిట్స్‌విల్లా’ ఫేమ్ ఖుషీ ముఖర్జీ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో సూర్య తనకు తరచూ మెసేజ్‌ చేసేవాడని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరం మాట్లాడుకోవడం లేదని చెప్పారు. ఏ క్రికెటర్‌తోనైనా డేటింగ్ చేయాలనుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. తన వెనుక చాలామంది పడుతున్నారని.. కానీ తాను ఎవరితోనూ అసోసియేట్ అవ్వాలనుకోవడం లేదని అనడం ఇప్పుడు SMలో వైరల్‌గా మారింది.

News December 30, 2025

సంక్రాంతికి మరో 11 స్పెషల్ ట్రైన్స్: SCR

image

సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 11 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) ప్రకటించింది. జనవరి 7 నుంచి జనవరి 12 మధ్య ఇవి రాకపోకలు సాగించనున్నాయి. కాకినాడ టౌన్‌-వికారాబాద్‌, వికారాబాద్‌-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్‌, పార్వతీపురం-కాకినాడ టౌన్‌, సికింద్రాబాద్‌-పార్వతీపురం, వికారాబాద్‌-కాకినాడ మధ్య ఈ ట్రైన్స్ నడవనున్నాయి. వీటికి బుకింగ్స్‌ ప్రారంభమైనట్లు తెలిపింది.