News February 6, 2025
BREAKING: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతోన్న క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది. అటు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోనుంది.
Similar News
News March 30, 2026
4 లక్షల చాక్లెట్స్ చోరీ.. కంపెనీ ఫన్నీ రియాక్షన్!

4.14 లక్షల చాక్లెట్లు చోరీ కావడంపై నెస్లే బ్రాండ్ ‘కిట్ క్యాట్’ ఫన్నీగా స్పందించింది. ‘కిట్క్యాట్తో బ్రేక్ తీసుకోమని మేం చెబుతుంటాం. కానీ ఈ దొంగలు మా స్లోగన్ను మరీ సీరియస్గా తీసుకున్నారు. ఏకంగా 12 టన్నుల చాక్లెట్లతో బ్రేక్ తీసుకున్నారు’ అని పేర్కొంది. మార్చి 26న చాక్లెట్ల లోడుతో ఇటలీ నుంచి పోలండ్ వెళ్తున్న ట్రక్కు మార్గమధ్యంలో మాయమైపోయింది. ఇప్పటికీ దాని ఆచూకీ తెలియరాలేదని నెస్లే తెలిపింది.
News March 30, 2026
నామినేషన్ వేసిన CM స్టాలిన్, విజయ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ కొలత్తూరు నుంచి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నామినేషన్ దాఖలు చేశారు. అటు తమిళగ వెట్రి కళగం(TVK) అధినేత, నటుడు విజయ్ దళపతి కూడా పెరంబూరు నియోజకవర్గానికి సంబంధించి చెన్నైలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
News March 30, 2026
చైనా సీసీటీవీలపై దేశంలో బ్యాన్?

ఏప్రిల్ 1 నుంచి హిక్విజన్, దహువా, TP-Link తదితర చైనా CCTV కెమెరాలు, పరికరాలను దేశంలో బ్యాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలో అమ్మే CCTV ప్రొడక్టులు కచ్చితంగా అనుమతి తీసుకోవాలని కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చైనా సంస్థలు, ఆ దేశంలో తయారైన చిప్సెట్లను ఉపయోగించే పరికరాలకు పర్మిషన్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నట్లు సమాచారం.


