News June 25, 2024
BREAKING: AP TET ఫలితాలు విడుదల

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 27-మార్చి 6 వరకు జరిగిన ఈ పరీక్షలో దాదాపు 2.3లక్షల మంది హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 14న విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ వల్ల అది సాధ్యపడలేదు. ఫలితాల కోసం ఇక్కడ <
Similar News
News December 18, 2025
క్యాబేజీలో నల్ల కుళ్లు తెగులు లక్షణాలు – నివారణ

నల్ల కుళ్లు తెగులు ఆశించి క్యాబేజీ మొక్క ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి వి(V) ఆకారంలో ఉన్న మచ్చలు ఏర్పడతాయి. ఈనెలు నల్లగా మారతాయి. ఈ తెగులు నివారణకు 10 లీటర్ల నీటిలో స్ట్రైప్టోసైక్లిన్ 1గ్రా. కలిపి నారు నాటినప్పుడు, గడ్డ తయారైనప్పుడు పైరుపై పిచికారీ చేయాలి. లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు కలిపి ఆ ద్రావణంతో మొక్కల మొదళ్ల చుట్టూ తడపాలి. ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పౌడర్ను భూమిలో వేయాలి.
News December 18, 2025
పాపం.. ఆయనకు ఒక్కరే ఓటేశారు!

TG: నిన్న మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సందర్భంగా యాదాద్రి(D) అడ్డగూడూర్(M) ధర్మారంలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఒకటో వార్డులో మొత్తం 119 ఓట్లుండగా కప్పల గోపికి 118 ఓట్లు పడ్డాయి. ప్రత్యర్థికి ఒకే ఓటు పడింది. ఇక ఆదిలాబాద్(D) ఉండంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మహేందర్ తొలుత 4 ఓట్లతో ఓడిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఆయన రీకౌంటింగ్ కోరగా చివరికి మహేందరే 6 ఓట్లతో గెలుపొందారు.
News December 18, 2025
రూ.1.6 లక్షలు.. సైనికులకు ట్రంప్ క్రిస్మస్ గిఫ్ట్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశ సైనికులకు క్రిస్మస్ గిఫ్ట్ ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.1.6 లక్షల ($1,776) ‘వారియర్ డివిడెండ్’ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 1776లో దేశ స్థాపనకు గుర్తుగా ఆ మొత్తాన్ని మిలిటరీ సర్వీస్ మెంబర్లకు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన చెక్కులు సిద్ధమయ్యాయని, పండుగకు ముందే సైనికులకు అందుతాయని చెప్పారు. దేశంలోని 14.5 లక్షల మంది సోల్జర్లకు ఈ మొత్తం అందనుంది.


