News April 5, 2025

BREAKING: APPSC గ్రూప్ 2 ఫలితాలు విడుదల

image

AP: ఈ ఏడాది ఫిబ్రవరి 23న నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. రిజల్ట్స్‌తోపాటు ఎగ్జామ్ ఫైనల్ కీ కూడా రిలీజ్ చేసింది. కీని APPSC వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. సర్టిఫికెట్ల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను సెలెక్ట్ చేసింది. స్పోర్ట్స్ కోటాతో సహా మొత్తం 2,517 మందిని ఎంపిక చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం వీరందరికి త్వరలోనే కాల్ లెటర్లు పంపనుంది.

Similar News

News April 12, 2025

పూరన్ విధ్వంసం.. LSG గ్రాండ్ విక్టరీ

image

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో LSG గ్రాండ్ విక్టరీ సాధించింది. 181 పరుగుల టార్గెట్‌ను 19.3 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఓపెనర్ మార్క్‌రమ్ (58) హాఫ్ సెంచరీతో రాణించారు. నికోలస్ పూరన్ (1 ఫోర్, 7 సిక్సర్లతో 61 రన్స్) విధ్వంసంతో జట్టు విజయం సాధించింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు. రషీద్, సుందర్ చెరో వికెట్ తీశారు.

News April 12, 2025

చందమామపై హ్యూమన్ వేస్ట్.. ఒక్క ఐడియాకు రూ.25 కోట్లు

image

అంతరిక్షంలో పేరుకుపోయిన మానవ వ్యర్థాలను తొలగించేందుకు మంచి ఐడియా ఇచ్చే వారికి నాసా బంపరాఫర్ ప్రకటించింది. వేస్ట్‌ను రీసైక్లింగ్ చేసేందుకు వినూత్న ఐడియా ఇచ్చే వారికి రూ.25 కోట్లు ($3 మిలియన్) ఇస్తామని ప్రకటించింది. 1969-72 మధ్య కాలంలో అపోలో మిషన్ ద్వారా నాసా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపింది. దీంతో అక్కడ 96 బ్యాగుల వ్యర్థాలు పేరుకుపోయాయి. కాంటెస్ట్ పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 12, 2025

ఇంటర్‌లో అత్యధిక మార్కులు

image

AP: ఇంటర్ ఫలితాల్లో పలువురు సత్తా చాటారు. హర్షిణి, హేమలత, సిరి (ప్రకాశం), లాస్య (తిరుపతి)లకు సెకండియర్ MPCలో 991 మార్కులు వచ్చాయి. Bipcలో హారిక (ప్రకాశం) 991 మార్కులు సాధించింది. ఫస్టియర్ MPCలో నాదెండ్ల కృష్ణప్రియ (పొన్నూరు) 470కి 467, భాగ్యలక్ష్మి(తిరుపతి) 465, KGBV విద్యార్థిని రేవతి (అనకాపల్లి) Bipcలో 440కి 433 మార్కులు తెచ్చుకున్నారు. మీకు తెలిసిన వారిలో ఎక్కువ మార్కులు ఎన్ని? కామెంట్ చేయండి.

error: Content is protected !!