News January 11, 2026
BREAKING: ATP ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

ట్రాక్టర్ బోల్తాపడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మద్దికేరలో ఆదివారం చోటు చేసుకుంది. వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన బోయ కిష్టప్ప పత్తికొండకు ఇటుకల లోడుతో వెళ్తున్నాడు. కర్నూలులోని బురుజుల రోడ్డు సెల్ టవర్ వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంపై ఉన్న అబ్దుల్ అజీజ్, శివ గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు ఎస్సై హరిత తెలిపారు.
Similar News
News February 5, 2026
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి: అనంత వెంకటరామిరెడ్డి

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా చర్యలు తీసుకుంటే, చంద్రబాబు సీఎం అయ్యాక పనులు నిలిపివేయడం అన్యాయమన్నారు. సీమ ప్రయోజనాల కోసం హంద్రీనీవా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
News February 5, 2026
పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయ దంపతుల విరాళం

అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మాకోడికి గ్రామ పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయ దంపతులు తిప్పే స్వామి, రామాంజనమ్మ తమ ఉదారత చాటుకున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపుతో స్పందించిన వీరు, పాఠశాలకు తమ నెల జీతం రూ.59,930 విరాళంగా ప్రకటించారు. తమ వంతు సాయం అందించడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులోనూ పాఠశాల ప్రగతికి తోడ్పాటు అందిస్తామని వారు స్పష్టం చేశారు.
News February 5, 2026
పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయ దంపతుల విరాళం

అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మాకోడికి గ్రామ పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయ దంపతులు తిప్పే స్వామి, రామాంజనమ్మ తమ ఉదారత చాటుకున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపుతో స్పందించిన వీరు, పాఠశాలకు తమ నెల జీతం రూ.59,930 విరాళంగా ప్రకటించారు. తమ వంతు సాయం అందించడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులోనూ పాఠశాల ప్రగతికి తోడ్పాటు అందిస్తామని వారు స్పష్టం చేశారు.


