News March 14, 2025

BREAKING: మసీదులో బాంబు బ్లాస్ట్

image

దాయాది పాకిస్థాన్ మరోసారి ఉలిక్కిపడింది. సౌత్ వజీరిస్థాన్‌లోని అజామ్ వర్సాక్‌లో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు జరుగుతుండగా ఓ మసీదులో బాంబు పేలింది. ఈ ఘటనలో JUI డిస్ట్రిక్ట్ చీఫ్ అబ్దుల్లా నదీమ్, మరొకరు గాయపడ్డారని సమాచారం. బాంబు పెట్టిందెవరు? ప్రాణ, ఆస్తి నష్టం గురించి తెలియాల్సి ఉంది. రంజాన్ మాసం రెండో శుక్రవారం కావడంతో ప్రజలు భారీగా మసీదుకు వచ్చారని సమాచారం.

Similar News

News March 14, 2025

వర్తు వర్మ.. ‘వారి కర్మ’

image

AP: పిఠాపురంలో పవన్ గెలుపుపై నాగబాబు చేసిన తాజా <<15761376>>వ్యాఖ్యలు<<>> YCPకి అస్త్రంగా మారాయి. వర్మ సపోర్టు వల్లే తాను అక్కడ గెలిచానని చెప్పిన పవన్ ఇప్పుడు ఆయనకే వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. తీరం దాటాక తెడ్డు తగలేసినట్లు జనసేనాని వ్యవహారం ఉందని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అప్పట్లో వర్తు వర్మ అని ఇప్పుడు ’వారి కర్మ’ అంటున్నారని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

News March 14, 2025

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

image

తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 20 నుంచి 26 వరకు జరగనున్నాయి. థియరీ పరీక్షలు రెండు సెషన్స్‌లో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మ. 12 గంటల వరకు, రెండో సెషన్ మ.2.30 గంటల నుంచి సా.5.30 గంటల వరకు జరుగుతుంది. అటు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభమై మే 3న ముగుస్తాయి.

News March 14, 2025

టాటా కమ్యూనికేషన్స్ ఛైర్మన్‌గా గణపతి సుబ్రహ్మణ్యం

image

తమ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్‌గా టాటా సంస్థ గణపతి సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. నామినేషన్-రెమ్యునరేషన్ కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆయన 2021లో బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. టీసీఎస్‌లో ఆయన గత 40 ఏళ్లుగా సేవలందించారు. ఆ సంస్థకు సీఓఓగా పనిచేసి గత ఏడాది మేలో పదవీవిరమణ చేశారు.

error: Content is protected !!