News November 30, 2024
BREAKING: ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు

TG: మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్ల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2002 నాటి నోటిఫికేషన్ ప్రకారం డిప్లమా ఇన్ హెల్త్ అసిస్టెంట్ అర్హత ఉన్న వారే అర్హులంది. సరైన అర్హతలు లేకపోవడంతో 2012లో హైకోర్టు తీర్పు మేరకు 1200 మందిని తొలగించారు. వీరిని 2013లో కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వం మళ్లీ తీసుకోగా, దీన్ని సవాల్ చేస్తూ జారీ చేసిన GOపై పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆ GOను కోర్టు రద్దు చేసింది.
Similar News
News October 22, 2025
సత్య నాదెళ్లకు రూ.846 కోట్ల జీతం

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం భారీగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన ప్యాకేజీ అంతకుమందు ఏడాదితో పోలిస్తే 22% అధికమైంది. ప్రస్తుతం ఆయన ఏడాదికి 96.5 మి.డాలర్ల (రూ.846 కోట్లు) జీతం అందుకుంటున్నారు. సత్య నాదెళ్ల, ఆయన లీడర్షిప్ టీమ్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మైక్రోసాఫ్ట్ పురోగతి సాధించిందని కంపెనీ బోర్డు తెలిపింది. అలాగే షేర్ల ధరలు పెరిగాయని పేర్కొంది.
News October 22, 2025
వయసుతో నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలు

* స్నేహితులు దూరమైనా నీతో నీకున్న బంధమే ముఖ్యం
* జనాలు నీ కష్టం కాకుండా ఫలితాలను మాత్రమే చూస్తారు
* వైఫల్యాలు జీవితంలో భాగమే
* ఇల్లు లాంటి మంచి చోటు మరొకటి లేదు
* జీవితంలో ముఖ్యమైనవి కుటుంబం, డబ్బు
* వ్యాయామం మనసుకు శాంతి, శరీరానికి బలం ఇస్తుంది
* పశ్చాత్తాపం, కన్నీళ్లు మీ సమయాన్ని వృథా చేస్తాయి
* అదృష్టం కాదు.. మీరు తీసుకునే నిర్ణయాలే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. Share it
News October 22, 2025
కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో లాభాలు

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రోసెటిన్, క్రోసిన్ కుంకుమపువ్వులో ఉంటాయంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. పాలలో కలుపుకొని తాగటం లేదా కుంకుమ పువ్వు టీ చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.