News July 4, 2024
BREAKING: చంద్రబాబు ధోరణి మార్చుకోవాలి: వైఎస్ జగన్

AP: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారని YS జగన్ మండిపడ్డారు. నెల్లూరు జైలులో ఆయనను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు ఓటేయలేదనే కారణంతో రాష్ట్రంలో ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. పైగా బాధితులపైనే దొంగ కేసులు పెడుతున్నారు. ఇంత దారుణంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. CBN ధోరణి మార్చుకోవాలి. లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు.
Similar News
News March 23, 2026
మూసీ ప్రక్షాళనపై సలహాలు స్వీకరిస్తాం: సీఎం రేవంత్

TG: మూసీ ప్రక్షాళన అత్యవసరమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘గుజరాత్లో సబర్మతి ప్రక్షాళనకు కాంగ్రెస్ సహకరించింది. HYDలో మూసీ అభివృద్ధికి రాజకీయ రంగు ఎందుకు? అడ్డుకోవడం తప్పించి ఏ సలహా ఇచ్చినా తీసుకుంటాం. నాకు చెప్పడానికి ఇబ్బందైతే మంత్రులతో కమిటీ వేస్తా. వాళ్లకైనా మీ అభిప్రాయాలు చెప్పండి’ అని సూచించారు.
News March 23, 2026
సంచలనం.. ఇకపై సిలిండర్లో 10 కేజీల గ్యాస్?

గ్యాస్ సరఫరాలో సమస్యలతో రీఫిల్లింగ్ సైజ్ను తగ్గించాలని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు యోచిస్తున్నట్లు ToI వెల్లడించింది. 14.2KGల సిలిండర్లలో 10KGల గ్యాస్నే(రేటు తగ్గించి) అందించే అవకాశం ఉందని తెలిపింది. ‘చిన్న ఫ్యామిలీకి 14.2KGల సిలిండర్ 35-40 రోజులు వస్తుంది. 10 కేజీలైతే నెలపాటు సరిపోతుంది. దీనివల్ల కొరత రాదు. ఈ సమయంలో కంపెనీలు నిల్వలను పెంచుకునే వీలుంటుంది’ అని ఓ అధికారి చెప్పినట్లు పేర్కొంది.
News March 23, 2026
దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న MLA దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని బీజేపీ MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. దీనిపై 4 వారాల్లో వివరణ ఇవ్వాలని దానంతోపాటు అసెంబ్లీ సెక్రటరీకి ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.


