News March 18, 2024
BREAKING: ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర

AP: ఎన్నికల తేదీ ఆలస్యమవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ నెల 27 నుంచి 20 రోజులపాటు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు. దాదాపు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుందని, 25 సభలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి ఎన్నికల బహిరంగసభల్లో సీఎం పాల్గొంటారని పేర్కొన్నాయి.
Similar News
News November 18, 2025
5 రోజుల్లో రూ.5వేలు తగ్గిన ధర.. కారణమేంటి?

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల <<18318028>>పతనం కొనసాగుతోంది<<>>. 5 రోజుల్లోనే 10గ్రాముల పసిడి ధర దాదాపు రూ.5వేలు, కేజీ వెండి రేటు రూ.15వేల వరకు తగ్గింది. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదనే అంచనాలతో గోల్డ్కు డిమాండ్ తగ్గినట్లు నిపుణుల అంచనా. అలాగే US డాలర్ బలపడటమూ ఓ కారణమని చెబుతున్నారు. కాగా ఫెడ్ వడ్డీ రేట్లు గోల్డ్ ధరలను ప్రభావితం చేసే విషయం తెలిసిందే.
News November 18, 2025
5 రోజుల్లో రూ.5వేలు తగ్గిన ధర.. కారణమేంటి?

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల <<18318028>>పతనం కొనసాగుతోంది<<>>. 5 రోజుల్లోనే 10గ్రాముల పసిడి ధర దాదాపు రూ.5వేలు, కేజీ వెండి రేటు రూ.15వేల వరకు తగ్గింది. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదనే అంచనాలతో గోల్డ్కు డిమాండ్ తగ్గినట్లు నిపుణుల అంచనా. అలాగే US డాలర్ బలపడటమూ ఓ కారణమని చెబుతున్నారు. కాగా ఫెడ్ వడ్డీ రేట్లు గోల్డ్ ధరలను ప్రభావితం చేసే విషయం తెలిసిందే.
News November 18, 2025
‘వారణాసి’లో నటించడం గొప్ప గౌరవం: ప్రియాంక

‘వారణాసి’లో హీరోయిన్గా నటిస్తున్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ‘తెలుగు & మలయాళ ఇండస్ట్రీలకు చెందిన దిగ్గజాలు మహేశ్, పృథ్వీరాజ్తో కలిసి రాజమౌళి మూవీలో పనిచేయడం గొప్ప గౌరవం. మా సినిమా విడుదలకు ఏడాది ముందే అంతర్జాతీయ మీడియాతో ప్రమోట్ చేస్తున్నాం. మూవీపై పెరిగిన అంచనాలు మాలో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. దేవుడి దయతో మీ అంచనాలను అందుకుంటాం. జై శ్రీరామ్’ అని రాసుకొచ్చారు.


