News November 27, 2024

BREAKING: ధనుష్-ఐశ్వర్యకు విడాకులు మంజూరు

image

తమిళ హీరో ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇటీవల వీరు విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. కలిసి జీవించేందుకు సుముఖంగా లేమని గత వారం కోర్టు విచారణలో ఇద్దరూ చెప్పారు. దీంతో ఏకాభిప్రాయం ఆధారంగా కోర్టు తీర్పు ఇచ్చింది. రజినీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్యను 2004లో పెళ్లి చేసుకోగా, 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరికి ఇద్దరు కుమారులు.

Similar News

News December 3, 2025

సివిల్ కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం: ASF SP

image

ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ శాఖ భరోసా సెంటర్ భవన నిర్మాణానికి సివిల్ కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SP నితికా పంత్ తెలిపారు. డిసెంబర్ 4న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు AR పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విల్లింగ్ కొటేషన్స్ స్వీకరిస్తామన్నారు. రూ.కోటిపైగా వ్యయంతో నిర్మాణ అనుభవం, 10 ఏళ్ల సేవ, 4 నెలల్లో పని పూర్తి చేసే సామర్థ్యం అర్హతలుగా పేర్కొన్నారు.

News December 3, 2025

రూ.3.30 నుంచి రూ.90 వరకు.. రూపాయి పతనం ఇలా!

image

స్వాతంత్య్రం(1947) వచ్చేనాటికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.3.30 ఉండేది. 30 సంవత్సరాల తర్వాత..
☛ 1977లో అది రూ.8.434కు చేరింది
☛ తరువాతి 30 ఏళ్ల(2007)కు 43.595గా ఉంది
☛ 2020లో రూ.73.23, 2021లో రూ.74.56, 2022లో రూ.82.76, 2023లో 83.4
☛ 2024లో 83.28కు బలహీనపడింది
☛ తాజాగా 2025 డిసెంబర్ నాటికి 90 రూపాయలకు పతనమైంది.

News December 3, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 15 మంది మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా దంతెవాడ అడవుల్లో జరిగిన భారీ <<18458130>>ఎన్‌కౌంటర్‌లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు మరణించగా ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. ఘటనాస్థలం నుంచి మావోలకు సంబంధించిన భారీ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు జనవరి 1న అంతా లొంగిపోతామని ఇటీవల అభయ్ పేరిట మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.