News May 3, 2024

BREAKING: ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల

image

TG: రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 3 విడతల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు. మొదటి విడత(మే 6-25), రెండో విడత (జూన్ 4-13), మూడో విడత (జూన్ 19-25) రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. జులై 8 నుంచి డిగ్రీ కాలేజీల తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది డిగ్రీలో కొత్తగా బీకాం ఫైనాన్స్, బీఎస్సీ బయో మెడికల్ సైన్స్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.

Similar News

News March 18, 2026

₹2.40 లక్షలిస్తాం.. ఇండియాకు వెళ్లిపోండి: US

image

అక్రమ వలసదారులు తమ దేశం విడిచి వెళ్లాలని US మరోసారి కోరింది. చట్టవిరుద్ధంగా నివసిస్తున్నందుకు వేసిన ఫైన్స్‌ను రద్దు చేయడంతో పాటు ఫ్రీగా ఫ్లైట్ టికెట్లు అందజేస్తామని పేర్కొంది. అలాగే ₹2,40,329 ఎగ్జిట్ బోనస్ కింద ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలో అక్కడి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ప్రకటనతో పాటు తాజ్‌మహల్ ఫొటోను పోస్ట్ చేసి ‘Fly to India For Free’ అంటూ రాయడం చర్చనీయాంశమైంది.

News March 18, 2026

జనం సెక్సువల్ కంటెంట్ చూస్తున్నారు: రక్షిత

image

‘KD: ది డెవిల్’ సినిమాలోని ‘సర్కే చునర్’ పాట అసభ్యంగా ఉందన్న <<19406830>>విమర్శల<<>>పై డైరెక్టర్ ప్రేమ్ భార్య, మాజీ నటి రక్షిత స్పందించారు. గతంలో వచ్చిన ఈ తరహా పాటలకులేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం జనం రక్తపాతం, సెక్సువల్ కంటెంట్‌ను చూస్తున్నారని, కేవలం ఒక్క పాటతో తన భర్తను వ్యక్తిగతంగా దూషించడం సరికాదని మండిపడ్డారు. కన్నడ సినిమాలను థియేటర్లకు చేర్చడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలని కోరారు.

News March 18, 2026

2028లో తెలంగాణలో ఎన్నికలు రావు: రేవంత్

image

TG: 2029లో దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలు వస్తాయని, 2028లో తెలంగాణలో ఎలక్షన్స్ జరగవని CM రేవంత్ ఢిల్లీలో అన్నారు. అంతకంటే ముందే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు వస్తే మంచిదే అని చెప్పారు. అటు మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల మేరకే TDP MP పుట్టా మహేశ్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో తమ ప్రమేయం లేదని, దీనిపై దర్యాప్తు కోసం సిట్‌ను నియమించినట్లు మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.