News July 16, 2024
కేసీఆర్ పిటిషన్పై విచారణ ముగించిన సుప్రీం

TG: విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ <<13639787>>నరసింహారెడ్డి<<>> స్థానంలో కొత్త వారిని నియమించి తదుపరి విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. కమిషన్ రద్దు చేయాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించింది. అటు సోమవారంలోగా కొత్త ఛైర్మన్ను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెల్లడించింది.
Similar News
News January 12, 2026
అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు నోటీసులు 1/2

TG: రాష్ట్రంలో 2వేల ఏజెన్సీల పరిధిలో 4L మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి ఆధార్, వేతన వివరాలను EX CS శాంతికుమారి కమిటీ సేకరించింది. అయితే ఏజెన్సీలు EPF, ESIలకు నిధులు జమచేయడం లేదని గుర్తించింది. ఆ అకౌంట్ల వివరాలివ్వాలని, లేకుంటే బ్లాక్ లిస్టులో పెడతామని తాజాగా నోటీసులిచ్చింది. ఇవి అందితే వాటి అవినీతి బాగోతం బయటపడనుంది. దీంతో ఏజెన్సీలు అకౌంట్లు తెరిచే పనిలో పడ్డాయి.
News January 12, 2026
అవుట్ సోర్సింగ్ పేరిట 12 ఏళ్లుగా నిధులు స్వాహా 2/2

TG: ఖాళీలు భర్తీకాని తరుణంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సిబ్బందిని GOVT నియమించుకుంటుంది. ఇందుకు ఏజెన్సీలకు 20% కమీషన్ 12 ఏళ్లుగా అందిస్తోంది. ఇవన్నీ గతంలో BRS నేతల బినామీల పేరిట ఏర్పాటైనవిగా తెలుస్తోంది. ఆధార్ లింక్ లేకపోవడంతో బోగస్ పేర్లతో నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. GOVT, ఉద్యోగి వాటా EPF, ESI నిధులనూ మింగేశాయి. ఇలా భారీగా దోచుకున్న సంస్థలపై ప్రభుత్వం నివేదికను రెడీ చేసింది.
News January 12, 2026
కొనసాగుతున్న రూపాయి పతనం

ఈ వారం మార్కెట్ను రూపాయి నష్టాలతో ప్రారంభించింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే 5 పైసలు పతనమయ్యి రూ.90.23 వద్ద కొనసాగుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణలు ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. శుక్రవారం 28 పైసలు పతనమయ్యి రూ.90.18 వద్ద ముగియగా ఇవాళ కూడా నష్టాల్లో కొనసాగుతోంది. జియో పాలిటిక్స్, అమెరికా టారిఫ్స్ భయం కూడా దీనికి కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.


