News January 2, 2025
BREAKING: మరోసారి భూప్రకంపనలు

AP: ప్రకాశంలో మరోసారి భూప్రకంపనలు కలకలం రేపాయి. ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో సెకన్ పాటు భూమి కంపించింది. భయాందోళనలకు గురైన స్థానికులు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Similar News
News April 11, 2026
వైభవంగా ‘సీతారాముల’ పెళ్లి.. పరవశించిన భక్తజనం

భద్రాద్రి క్షేత్రంలో శనివారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య కళ్యాణ వేడుక కన్నుల పండుగగా జరిగింది. మంగళవాయిద్యాల నడుమ, వేద మంత్రోచ్ఛారణలతో అర్చకులు సీతారాములకు కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. దేవస్థానం మొత్తం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.
News April 11, 2026
ఫోన్ పోయిందా? ‘సంచార్ సాథీ’తో తిరిగి పొందండి!

మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారికి ‘సంచార్ సాథీ’ వరంలా మారింది. ఈ <<15182220>>యాప్<<>> ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ వంటి రాష్ట్రాల్లో లక్షకు పైగా ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టెలికం శాఖ తెలిపింది. Sanchar Saathi యాప్లో పోయిన ఫోన్ను సులభంగా బ్లాక్, ట్రాక్ చేయవచ్చు. డిజిటల్ భద్రతను పెంచేందుకు, అపరిచిత సిమ్ కార్డులను గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
News April 11, 2026
చిన్నారులకు విటమిన్ డి ఎందుకు అవసరం?

పిల్లల ఎముకలు,కండరాల ఆరోగ్యం విషయంలో విటమిన్ D పాత్ర చాలా ముఖ్యమైనది. రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంలో D విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ D లోపం కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు, నిరంతరం అలసట, జుట్టు పల్చబడటం, గాయాలు నెమ్మదిగా మానడం మొదలైనవి విటమిన్ D లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.


