News March 18, 2024
BREAKING: చంద్రబాబుకు ఈసీ నోటీసులు

AP: YSRCP ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. సీఎం జగన్పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు చేస్తోందని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. FB, ట్విటర్, యూట్యూబ్ ద్వారా జగన్ వ్యక్తిత్వంపై దాడి చేసే విధంగా ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు. దీంతో 24 గంటల్లోగా అసభ్యకర పోస్టులను తొలగించాలని సీఈవో ఆదేశించారు.
Similar News
News February 1, 2026
భారత్ U19 జట్టు ఆలౌట్.. పాక్ టార్గెట్ ఎంతంటే?

U19 వరల్డ్ కప్లో భాగంగా పాక్తో జరుగుతున్న సూపర్-6 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో వేదాంత్ త్రివేది(68) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచారు. చౌహన్ (35), అంబ్రిష్ (29), వైభవ్ (30) రాణించారు. చివరి 10 ఓవర్లలో భారత్ 72 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. పాక్ సెమీస్ వెళ్లాలంటే 33.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి.
News February 1, 2026
‘ఫార్మర్ రిజిస్ట్రీ’లో పేరు నమోదు చేసుకోకపోతే..

AP: రైతులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు కేంద్రం ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదును చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఇప్పటికీ 13L మంది రిజిస్టర్ చేసుకోలేదు. వీరు PM కిసాన్-అన్నదాత సుఖీభవ(ఏటా ₹20K) నిధులు పొందలేరని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ వెల్లడించారు. రైతు సేవా కేంద్రాలు లేదా APAIMS 2.0 యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ-పంట నమోదునూ రైతులే యాప్ ద్వారా చేసుకోవచ్చని తెలిపారు.
News February 1, 2026
2 గంటలుగా కేసీఆర్ విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ సీఎం కేసీఆర్ను సిట్ రెండు గంటలుగా విచారిస్తోంది. అధికారులు ఏం ప్రశ్నలు అడిగారు? ఆయన ఏం సమాధానాలిచ్చారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే కేసులో ఇప్పటికే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, అడిషనల్ ఎస్పీలు రాధాకిషన్ రావు, తిరుపతన్న, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్లను సిట్ విచారించిన విషయం తెలిసిందే.


