News April 16, 2024

BREAKING: టీడీపీకి ఈసీ నోటీసులు

image

AP: టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్న లోకేశ్‌తో పాటు టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ ఇవ్వాలని అడిషనల్ సీఈవో నోటీసులు జారీ చేశారు.

Similar News

News January 24, 2026

కెనడాను చైనా మింగేస్తుంది: ట్రంప్

image

చైనాతో వ్యాపారం చేస్తే కెనడాకే ప్రమాదమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌పై గోల్డెన్ డోమ్ ఏర్పాటుకు మద్దతివ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ‘గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను కెనడా వ్యతిరేకిస్తోంది. నిజానికి అది వారి దేశాన్ని కూడా రక్షిస్తుంది. దానికి బదులుగా చైనాతో వ్యాపారం చేసేందుకే మొగ్గు చూపుతోంది. నిజానికి కెనడాని చైనా ఏడాదిలోనే మింగేస్తుంది’ అని పేర్కొన్నారు.

News January 24, 2026

ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్.. ధర ఎంతంటే?

image

iPhone 18 ప్రో సిరీస్‌కు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ డైనమిక్ ఐలాండ్‌తో కాకుండా అండర్‌ డిస్‌ప్లే ఏరియాతో రానున్నట్లు సమాచారం. కొత్తగా 2nm టెక్నాలజీతో తయారైన A20 ప్రో చిప్‌తో పాటు కెమెరాలో మెకానికల్ ఐరిస్‌ వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబరులో లాంచ్‌ కావొచ్చు. ధర విషయానికి వస్తే 18 ప్రో రూ.1,34,900, ప్రో మ్యాక్స్ రూ.1,49,900గా ఉండొచ్చు.

News January 24, 2026

468రోజుల తర్వాత సూర్యకుమార్ హాఫ్ సెంచరీ

image

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ రెండో T20లో పరుగుల వరద పారించారు. 23 ఇన్నింగ్సుల(468 రోజులు) సుధీర్ఘ ఎదురు చూపులకు హాఫ్ సెంచరీతో చెక్ పెట్టారు. అది కూడా 23 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం. T20WC నేపథ్యంలో తన ఫామ్‌పై వస్తున్న అనుమానాలను ఈ ఇన్నింగ్స్‌తో పటాపంచలు చేశారు. అలాగే సూర్య భారత్ తరఫున అత్యధిక T20I మ్యాచులు(126) ఆడిన లిస్ట్‌లో కోహ్లీ(125)ని దాటేశారు. రోహిత్(159) తొలిస్థానంలో ఉన్నారు.