News March 18, 2024
BREAKING: ఎన్నికల ముందు ఈసీ కీలక ఆదేశాలు

లోక్సభ ఎన్నికలకు ముందు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్తో పాటు గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోం సెక్రటరీలను తొలగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 4, 2025
ఇతిహాసాలు క్విజ్ – 86 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: పార్వతీ దేవి అవతారంగా, శక్తి స్వరూపిణిగా, విష్ణుమూర్తి సోదరిగా పరిగణించబడే, ఈశ్వరుడు వివాహం చేసుకున్న దేవత ఎవరు? అలాగే, ఆమెకు తమిళనాడులో ఒక ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. ఆమెతో పాటు ఒక పచ్చ చిలుక కూడా కనిపిస్తుంది.
సమాధానం: మధుర మీనాక్షి అమ్మవారు. ఈ దేవత ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని మధురలో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 4, 2025
బొగ్గు గనుల నుంచి విష వాయువులు

ఝార్ఖండ్లోని ధన్బాద్ జిల్లా కేందౌది బస్తీ ప్రాంతంలోని బొగ్గు గనుల నుంచి విష వాయువులు వెలువడుతున్నాయి. ఇప్పటికే స్థానికంగా ఒక మహిళ మరణించగా 12 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు ఆ ప్రాంతంలోని 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డేంజర్ జోన్లో ఉన్న ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. 3 అంబులెన్సులను ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంచినట్లు తవ్వకాలు జరుపుతున్న BCCL ప్రతినిధి తెలిపారు.
News December 4, 2025
రేపు పిడుగులతో కూడిన వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి(D) చిట్టమూరులో 88.5mm, చింతవరంలో 81mm, నెల్లూరులో 61mm, పాలూరులో 60mm వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.


