News March 20, 2024

BREAKING: పరీక్ష వాయిదా

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ బోర్డు సెక్రటరీ పుల్లయ్య కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మే 17న జరగాల్సిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష(పాలీసెట్)ను వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేశారు. మే 24న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News September 12, 2025

రేపు గ్రూప్-2 మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: 783 గ్రూప్-2 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మూడో విడత తేదీలను TGPSC ప్రకటించింది. రేపు ఉదయం 10.30 గంటల నుంచి HYD నాంపల్లిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో ప్రారంభమవుతుందని తెలిపింది. అభ్యర్థులు హాజరయ్యాక ఇంకా ఏవైనా పత్రాలు పెండింగ్‌లో ఉంటే ఈనెల 15న సమర్పించొచ్చని పేర్కొంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.inలో చూడొచ్చు.

News September 12, 2025

అవినీతిని అడ్డుకునేందుకు AI మినిస్టర్.. ఎక్కడో తెలుసా?

image

ప్రపంచంలోనే ఏఐ ఆధారంగా పనిచేసే మంత్రిని అల్బేనియా దేశం నియమించింది. ఈ ఏఐ మహిళా మంత్రికి ‘డియెల్లా’ అని పేరు పెట్టింది. ఈమె అన్ని ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించిన బాధ్యతలను పర్యవేక్షిస్తారు. దీనిద్వారా అల్బేనియా ప్రభుత్వం అవినీతిని తగ్గించొచ్చని భావిస్తోంది. అల్బేనియాలో ప్రభుత్వ టెండర్లు & ప్రజా నిధుల కేటాయింపుల్లో భారీగా అవినీతి జరుగుతుందనే ఆరోపణలున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.

News September 12, 2025

PHOTOS: వే2న్యూస్ కాన్‌క్లేవ్-2025

image

AP: నేడు మంగళగిరిలో నిర్వహించిన Way2News కాన్‌క్లేవ్-2025 విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు.. రాజధాని అమరావతి, పోలవరం, పెట్టుబడులు, మెడికల్ కాలేజీలు ఇలా అనేక అంశాలపై తన విజన్‌ను వివరించారు. అటు వైసీపీ నుంచి సజ్జల, బుగ్గన తమ పాలనలో చేసిన పనులు, ఆలోచనలను పంచుకున్నారు. ఈ ప్రోగ్రామ్ ఫొటోస్‌ను పై గ్యాలరీలో చూడొచ్చు.