News October 4, 2025
BREAKING: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు

TG: హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో బస్సు ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు ఈనెల 6నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. మొదటి 3 స్టేజీల వరకు రూ.5 చొప్పున, 4వ స్టేజీ నుంచి రూ.10 చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేయనుంది. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఇ-ఆర్డినరీ, ఇ-ఎక్స్ప్రెస్ బస్సుల్లో పెంచిన ఛార్జీలు అమలుకానున్నాయి.
Similar News
News April 7, 2026
ఇరాన్ భయంతో బహ్రెయిన్ను కలిపే బ్రిడ్జిని మూసేసిన సౌదీ

ఇరాన్ తమ దేశంలోని బ్రిడ్జిలపై దాడి చేస్తుందనే భయంతో సౌదీ అప్రమత్తమైంది. ముందుజాగ్రత్తగా బహ్రెయిన్కు వెళ్లే కింగ్ ఫాద్ కాజ్వే బ్రిడ్జిని మూసేసింది. ఈ 25 KM బ్రిడ్జి సౌదీని బహ్రెయిన్ను కలుపుతుంది. 1986లో ప్రారంభించగా రోజుకు 90వేల మంది దీనిపై ప్రయాణిస్తారు. కాగా US ఇరాన్లోని B-1 <<19566834>>బ్రిడ్జిని<<>> పేల్చేసిన సంగతి తెలిసిందే. దీంతో గల్ఫ్ దేశాల్లోని వంతెనలను పేల్చేస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది.
News April 7, 2026
జైలర్-2 కోసం షారుఖ్ 5 రోజుల షూటింగ్?

నెల్సన్ డైరెక్షన్లో రజినీకాంత్ నటిస్తున్న జైలర్-2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్లో జరిగిన చిత్రీకరణలో మోహన్ లాల్ తన పార్ట్ను కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్గా క్యామియో రోల్ చేయనున్నారు. ఇందుకు 5 రోజులు డేట్స్ ఇచ్చారని, త్వరలోనే షూటింగ్ జరగనుందని సమాచారం. ఇది HYDలోనా, మరో సిటీలోనా అనేది త్వరలో క్లారిటీ రానుంది.
News April 7, 2026
పంజాబీ నటితో అర్ష్దీప్ డేటింగ్? ఫొటో వైరల్!

స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ తాజాగా షేర్ చేసిన ఒక స్నాప్చాట్ ఫొటో హాట్ టాపిక్గా మారింది. దాంట్లో అర్ష్దీప్ ఒకమ్మాయి చేయి పట్టుకొని ఉండగా నెటిజన్లు ఆమె పంజాబీ నటి సమ్రీన్ కౌర్ అని అంటున్నారు. ఆమె చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. IPL 2026 మ్యాచుల్లో సమ్రీన్ పంజాబ్ జెర్సీలో కనిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. వీరిద్దరూ తమ రిలేషన్పై ఇప్పటివరకు స్పందించలేదు.


