News September 21, 2024
BREAKING: దేవుడా క్షమించు: పవన్ కళ్యాణ్

AP: తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నట్లు ట్వీట్ చేశారు. ఏడుకొండల వాడిని క్షమించాలని కోరారు. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇలాంటి వాటికి పాల్పడుతారన్నారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోతే హైందవ జాతికే కళంకమని పేర్కొన్నారు. పాప నివారణగా రేపు ఉదయం కాకానిలోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో 11 రోజుల దీక్ష చేపడుతానని తెలిపారు.
Similar News
News November 18, 2025
కొండెక్కిన ‘కోడిగుడ్డు’

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలతో పాటు కోడి గుడ్ల రేట్లు కూడా కొండెక్కుతున్నాయి. కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల సమయంలో వినియోగం తగ్గినా రేటు పైపైకి వెళ్తోంది. జూన్లో ఫారం వద్ద ఒక్కో ఎగ్ ధర ₹4.60 ఉండగా, రిటైల్ మార్కెట్లో ₹5.50 పలికింది. ఇప్పుడు ఫారంలో ₹6కు, రిటైల్లో ₹7కు చేరింది. పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చు పెరగడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
News November 18, 2025
కొండెక్కిన ‘కోడిగుడ్డు’

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలతో పాటు కోడి గుడ్ల రేట్లు కూడా కొండెక్కుతున్నాయి. కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల సమయంలో వినియోగం తగ్గినా రేటు పైపైకి వెళ్తోంది. జూన్లో ఫారం వద్ద ఒక్కో ఎగ్ ధర ₹4.60 ఉండగా, రిటైల్ మార్కెట్లో ₹5.50 పలికింది. ఇప్పుడు ఫారంలో ₹6కు, రిటైల్లో ₹7కు చేరింది. పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చు పెరగడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
News November 18, 2025
BIG ALERT: మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందంటూ వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నారు. SBI లోగోను డీపీగా పెట్టుకుని APK ఫైల్స్ను పంపుతున్నారు. దీన్ని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే SBI అలాంటి ఫైల్స్ను ఎప్పుడూ పంపదని, వాటిని క్లిక్ చేయొద్దని PIB Fact Check స్పష్టం చేసింది.
#ShareIt


