News November 30, 2024
టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్ పరీక్షల ఎత్తివేత నిర్ణయాన్ని వాయిదా వేసింది. వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది 80శాతం మార్కులతో పరీక్షలు, 20 శాతం ఇంటర్నల్ మార్కులుంటాయని పేర్కొంది. గ్రేడింగ్ విధానంతోనే ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. కాగా ఈసారి నుంచి ఇంటర్నల్ ఎత్తివేస్తామని ప్రభుత్వం నిన్న <<14735937>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే.
Similar News
News March 17, 2026
కాసేపట్లో వర్షం

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 41-61కి.మీ మధ్య గాలులు వీయడంతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని పేర్కొంది.
News March 17, 2026
ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తా: జీవన్ రెడ్డి

TG: తాను <<19382690>>పార్టీ<<>> మారాలనుకునే ఆలోచనకు కారణం జగిత్యాల MLA సంజయ్ అని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్తో తనది 40 ఏళ్ల బంధమన్న ఆయన.. తనకు ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నానో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఇంకా కాంగ్రెస్లోనే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. పార్టీ పిలుపు మేరకు 4 దశాబ్దాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టానన్నారు. చూడాలి జగిత్యాలలో మున్ముందు ఏం జరుగుతుందో.
News March 17, 2026
టెస్టులకు సడన్గా రిటైర్మెంట్.. కారణం వెల్లడించిన అశ్విన్

టెస్టులకు సడన్గా రిటైర్మెంట్ ప్రకటించడంపై అశ్విన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. ‘టీమ్లో సీనియర్ బౌలర్ నేనుండగా పెర్త్ టెస్టులో(2024లో AUSతో) సుందర్ను ఆడించారు. అప్పుడే నా టైమ్ అయిపోయిందని గ్రహించా’ అని వెల్లడించారు. గంభీర్ అంటే తనకు ఇష్టమని, ఆయన వ్యక్తుల కంటే జట్టుకే ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. కోహ్లీ, రోహిత్, తాను ఎప్పుడూ ఒకరినొకరు నిందించుకోలేదని, గెలుపు కోసమే ప్రయత్నించామన్నారు.


