News July 3, 2024
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా

AP: ఈనెల 28న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు APPSC ప్రకటించింది. కొత్త తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించగా ఏప్రిల్ 10న ఫలితాలు వెలువడ్డాయి.
Similar News
News November 6, 2025
నేడు నాలుగో టీ20.. గెలుపుపై ఇరు జట్ల కన్ను!

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ మ.1.45 గంటలకు 4వ T20 జరగనుంది. ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచుల్లో తొలి T20 రద్దు కాగా చెరొకటి గెలిచాయి. నేటి మ్యాచులో గెలిచి సిరీస్లో ముందంజ వేయాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. గత మ్యాచులో గెలవడం భారత్కు కాస్త సానుకూలాంశం. బౌలింగ్లో స్టార్ బౌలర్ బుమ్రా ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్లో గిల్, సూర్య, తిలక్ భారీ స్కోర్లు చేస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచవచ్చు.
News November 6, 2025
వేదాల్లో ఏముంటాయి? వాటినెందుకు చదవాలి?

సంతోషం కోసం వేదాలు చదవాలి. ఇందులో ప్రధానంగా 4 విషయాలు ఉన్నాయి.
1. ఐహిక సుఖాలను, ఆనందాలను పొందేందుకు ఉపాయాలు.
2. దేవతల అనుగ్రహం కోసం పాటించవలసిన వివిధ ఉపాసనలు, పద్ధతులు.
3. జీవిత అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని సాధించడానికి మార్గదర్శకమైన వచనాలు.
4. నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలకు మూలాలైన అనేక ప్రాథమిక సూత్రాలు. <<-se>>#VedikVibes<<>>
News November 6, 2025
నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన!

నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతోందని APSDMA పేర్కొంది. ఇవాళ కృష్ణా, ప్రకాశం, NLR, ATP, కడప, చిత్తూరు, TPT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలో ఉ.8.30 గంటల వరకు ఆదిలాబాద్, నిర్మల్, మహబూబ్నగర్, నారాయణ్పేట్, నల్గొండ, నిజామాబాద్, వనపర్తి, గద్వాల, RR, HYD, మల్కాజ్గిరి, వికారాబాద్ ప్రాంతాల్లో వర్షం కురిసే ఛాన్సుందని HYD IMD తెలిపింది.


